ఇంద్రకీలాద్రి బుధవారం శ్రీ సరస్వతీ దేవి అలంకృత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
నాయుడు మాట్లాడారు
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని దుర్గమ్మ భక్తులందరికీ నమస్కారం. అత్యంత విశిష్టమైన అమ్మవారి జన్మ నక్షత్రమైన* *మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవదాన్ని అదృష్టంగా భావిస్తున్నాను.
దుర్గమ్మపైన ఉండే భక్తిభావంతో పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. ఒక్కోసారి లక్షమందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా మనం దసరా పండగ జరుపుకుంటున్నాం. మంచిని ప్రోత్సహించి రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నడిచేలా చూడాలని అమ్మవారికి ప్రార్థనలు చేశాను. భక్తులపరంగా ఆదాయం పరంగా ఇలా ప్రతి విషయంలోనో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తర్వాత దుర్గమ్మ ఆలయం పెద్దదిగా విశిష్టతను కలిగి ఉంది. ఒకసారి దుర్గమ్మను దర్శనం చేసుకుంటే విజయానికి ఎలాంటి ఢోకా ఉండదనేది భక్తుల విశ్వాసం. ఎన్ని దుష్టశక్తులు వచ్చినా ఆ దుర్గమ్మ చూసుకుంటుందనే నమ్మకం, విశ్వాసం భక్తులకు ఉంది.*
దేవాలయాల్లో పవిత్రత కాపాడుకోవడం మన అందరి బాధ్యత. ఈ స్ఫూర్తిని పెంచే విధంగా ముందుకెళ్లాలి. దసరా శరన్నవరాత్రులు సందర్భంగా సేవా కమిటీలు సేవలందిస్తున్నాయి. గతంలో ఉత్సవ కమిటీలు ఉండేవి. ఇప్పుడు* సేవా కమిటీలు భక్తులకు సేవలు అందిస్తున్నాయి. ఇది స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. దేవాలయాలకు వచ్చే ప్రతి వ్యక్తి దేవునిపై భక్తిభావంతో రావాలి. దుర్గామాతపై భక్తి ఉండేవాళ్ళు ఇక్కడకు రావాలి. వచ్చేవారిలో భక్తి భావం ఉంటే సార్ధకత ఉంటుంది. నిన్నటివరకు అమ్మవారి దర్శనానికి 5,85,651 మంది భక్తులు దర్శనానికి వచ్చారు. మూలా నక్షత్రం రోజు అయిన ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు 67,936 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. నిన్నటి వరకు రూ. 500 టికెట్ ద్వారా 28,470 మంది, రూ. 300 టికెట్ ద్వారా 13,029 మంది, రూ. 100 టికెట్ ద్వారా 29,613 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 6,96,396 లడ్డు ప్రసాదం అందించడం జరిగింది. లక్షా ఏడువేల మందికి అన్న ప్రసాదం అందించడం జరిగింది. 8,76,100 మంచినీటి బాటిల్లను భక్తులకు అందించాం. 12 లక్షల 55 వేల మంచినీటి ప్యాకెట్లు అందించాం. 75 వేల పాల ప్యాకెట్ల పాలను అందించడం జరిగింది. 1,23,000 మందికి మజ్జిగ ప్యాకెట్లు అందించడం జరిగింది. ఈసారి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇందుకు అందరినీ అభినందిస్తున్నాను. ఒకపక్క దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అదే విధంగా కమిషనర్ తదితర అధికారులందరూ బాగా పనిచేశారు. స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు. వీఐపీలు కూడా బాగా సహకరించారు. సామాన్య భక్తులకు ఎక్కువ సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ సహకరించారు. ఈసారి శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. భక్తుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరుగుతోంది. ప్రతిరోజు సమాచారం తెప్పించుకుంటున్నాం. ఈరోజు ఉదయం నుంచి చాలా కచ్చితమైన ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. క్యూలైన్లలో 85 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ అలంకరణపై 92 శాతం, పారిశుధ్యంపై 87 శాతం, తాగునీటి సరఫరాపై దాదాపు 95 శాతం, అన్నప్రసాదంపై 94 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. ఉభయ దాతల సేవా కార్యక్రమాలకు సంబంధించి 94 శాతం, వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు చేసిన ఏర్పాట్లపై 94 శాతం, కేశఖండన సేవలపై 96 శాతం సంతృప్తి స్థాయిలు నమోదయ్యాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకొని విశ్లేషించి భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరిస్తున్నాం. ఈ ఏడాది దుర్గమ్మ తల్లి దయవల్ల వర్షాలు బాగాపడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా కృష్ణమ్మ పొంగిపొర్లే పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా సక్రమమైన వర్షాలు పడాలని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు పోవాలని అమరావతి నిర్మాణంతో పాటు పోలవరం కూడా పూర్తి చేయాలని నదులను అనుసంధానం చేయాలని, పేదరికం లేని సమాజం కోసం అందరూ ఒక లక్ష్యం కోసం ముందుకుపోయి ఎక్కడ పేదరికం ఉంటే నా పేదరికం తొలగించేలా పరిపాలన ఇవ్వాలనేది మా అభిమతం. మనందరిపైన అమ్మవారు ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటున్నాను. మూలా నక్షత్రం రోజున ప్రతిఒక్కరికి ఉచితంగా లడ్డు ఇవ్వడం జరుగుతోంది. వీఐపీలు, ఆదాయం కంటే భక్తుల మనోభావాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో పాలకమండళ్ళు సేవలందిస్తాయి.
ఒక దేవాలయంలోగానీ, ప్రార్థనాలయాల్లో గానీ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకునే విధంగా విధానాలు ఉంటాయి. అక్కడ ఉన్న సంప్రదాయాలను పాటిస్తాం. చట్టాలను గౌరవిస్తాం. ఇది ఒక ఆనవాయితీగా తీసుకెళ్లి మళ్ళీ ప్రతి ఆలయానికి పూర్వ వైభవం వైభవం వచ్చే విధంగా కార్యక్రమాలు చేపడతాం