10..10..2024
దుర్గాదేవి చెంత సాంస్కృతిక శోభ
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కనకదుర్గ నగర్ లోని కళావేదికపై కళాకారులు ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వెంకటరమణ బృందం, శ్రీదేవి భజన సంకీర్తన, సత్యవతి సాహితీ కళారూపం, రవికుమార్ భక్తిరంజిని రవికుమార్ భక్తి రంజని వీక్షికులను మంత్రముగ్ధుల్ని చేశాయి. మనోజ్ఞ, ఉషా మాధవి, శ్రావ్య, అరుణ కళ్యాణి, మహతి, పుణ్య శ్రీ తదితర కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి . దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని చూసేందుకు విశేషంగా తరలివచ్చిన భక్తులు దర్శనం అనంతరం కళా ప్రదర్శనలు తిలకించి మైమరిచిపోయారు.