గురువారం దుర్గాష్టమి రోజున శ్రీ దుర్గా దేవి అలంకృత కనక దుర్గమ్మ అమ్మవారిని కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస వర్మ దర్శించుకున్నారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కూటమి ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. దీంతో సామాన్య భక్తులు అమ్మవారిని ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకోవడం జరుగుతోందన్నారు. ఇంద్రకీలాద్రిపై చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.*