*ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.*
*తేదీ.14.10.2024.
దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చండి హోమం మరియు పూర్ణాహుతి కార్యక్రమాలు.
విజయవాడ నగరం, ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నందు ప్రతిష్టాత్మకంగా జరిగిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురస్కరించుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతులను పురస్కరించుకుని పూర్ణాహుతి మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఈ సందర్భంగా ది.14.10.2024వ తేదీన విజయవాడ, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో వన్ టౌన్ పోలీసులు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలను పది రోజులు పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహించి ఈ రోజు చండీ హోమం నిర్వహించడం జరిగింది. అనంతరం దసరా ముగింపు కార్యక్రమానికి ఎన్.టి.ఆర్.జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ముఖ్య అతిధిగా విచ్చేసి, వేద పండితులు నిర్వహించిన హోమంనందు పూర్ణాహుతిని సమర్పించి, దసరా మహోత్సవాలకు ముగింపు పలకడం జరిగింది. ఈ కార్యక్రమములో పోలీస్ కమీషనర్ స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు, అనంతరం ఆలయ కమాండ్ కంట్రోల్ వద్దకు వెళ్లి సి.సి కెమెరా ద్వారా భక్తుల రద్దీని పరయ్యవేక్షించి అధికారులుకు ,సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించడం జరగినది.
నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. ఈ ఏడాది 6000 మంది వరకూ పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు. దాదాపు 15 లక్షల వరకూ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.అన్ని డిపార్ట్మెంట్ ల సమన్వయంతో ఈ దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులకు ఇబ్బంది కలగకుండా పోలీసులు పోలీస్ సిబ్బంది గతం లోకంటే బాగా పనిచేసారు. నవరాత్రులకు సహకరించిన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.తో పాటు , డి.సి.పి. గౌతమి షాలి ఐ.పి.ఎస్. దేవస్థాన ఈ ఓ కె. ఎస్. రామారావు ఏ.డి.సి.పి.లు ఏ.సి.పి.లు, వన్ టౌన్ ఇన స్పెక్టర్ గురుప్రకాష్ మరియు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.