చిట్టినగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వేలాది మందికి అన్నప్రసాద వితరణ
విజయవాడ, అక్టోబర్ 14: దసరా మహోత్సవాల ముగింపు సందర్భంగా చిట్టి నగర్ లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో సోమవారం వేలాది మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ల హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు (పీ. సీ),గౌరవాధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ దసరా మహోత్సవాలను తమ కమిటీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం పట్ల భక్తుల నుండి ప్రశంసలు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలాగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో కూడా వేలాదిగా భక్తులు విచ్చేసి అన్న ప్రసాదాన్ని స్వీకరించడం సంతోషంగా ఉందని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షులు మరుపిళ్ల సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్ , శీరం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.