Home Political news వరద బాధితులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహాకారంతో సుజనా ఫౌండేషన్ జపానంద స్వామీజీ

వరద బాధితులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహాకారంతో సుజనా ఫౌండేషన్ జపానంద స్వామీజీ

2
0

 విజయవాడ వరద బాధితులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహాకారంతో సుజనా ఫౌండేషన్ జపానంద స్వామీజీ

రామకృష్ణ ఆశ్రమం ఆధ్వర్యంలో (15-10-2024) మంగళవారం ఉదయం 11గంటలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ NDA కార్యాలయము, స్వాతి ధియేటర్ రోడ్ ,భవానీపురం విజయవాడ నందు 3 వేల మందికి నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు yసత్యకుమార్ మాట్లాడుతూ విజయవాడలో కురిసిన భారీవరదలకు బుడమేరు కట్ట తెగిన కారణంగా విజయవాడలో లక్షల మంది ప్రజలు 10 రోజులపాటు అనేక ఇబ్బందులు గురికావడం జరిగిందని,ఆ సందర్బంలో రామకృష్ణ సేవాఆశ్రమ అధ్యక్షులు జపానంద స్వామిజి ఇన్ ఫోసిస్ వారి సహకారంతో వేలాది మంది వరద బాధితులకు నిత్యవసర సరుకుల కిట్లను పంపిణీ చేయడం జరిగిందని వారి సేవలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నామని,అలాగే సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ MLA సుజనా చౌదరి ఆధ్వర్యంలో లక్షల మందికి భోజనాలు,నిత్యవసర సరుకులు,మంచినీరు,అత్యవసర వైద్యసేవా కిట్లను ఇంటింటికి పంచి వరద బాధితులకు సేవలు అంధించారని వారికి కూడా ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నామని,ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు 12 రోజుల పాటు ఇంటికి వెళ్ళకుండా బస్సులో నిద్రించి,ఆఫీసులో వుండి వరద బాధితులకు సేవ చేసారని,ఆలాగే కేంద్ర ప్రభుత్వం కూడా NDRF బృందాలను పంపడం,సైనికులను,హెలికాప్టర్లను పంపడం,తక్షణ వరదసహాయక నిధిని అందించడం వంటివి చేసి వరద భాధితులను ఆదుకుందని,ఇక ఈ వైసిపి అధినేత ఒక్కరోజు కూడా వరదబాధితులను పరామర్శించకుండా,జైల్లో వున్న మర్డర్ కేసు ముద్దాయిలను పరామర్శించడానికి వెళ్ళారని,అదేవిధంగా కోటి రూపాయిల విరాళం ప్రకటించి ఒక్క రూపాయికూడా ఇవ్వలేదని ఈ సందర్బంగా ఆయన విమర్శించారు. ఈ సందర్బంగా రామకృష్ణ సేవాశ్రమ అధ్యక్షులు జపానంద స్వామిజి మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని, ఇన్ ఫోసిస్ సహకారంతో రామకృష్ణ సేవాశ్రమం వారు దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని,ఈ సేవా కార్యక్రమంలో సహాయ సహకారములు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలియచేస్తున్నామన్నారు.ఈ సందర్బంగా NTR జిల్లా BJP 

అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ విజయవాడకు వరదలు వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్షల మందికి సహాయం అందిస్తున్న సుజనా చౌదరిగారికి,అలాగే ఇన్ ఫోసిస్ సహకారంతో రామకృష్ణ ఆశ్రమ అధ్యక్షులు జపానంద స్వామీ అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని,అలాగే వరదలు వచ్చిన సమయంలో ఇంట్లో వుండి ఒక్క సేవాకార్యక్రమం కూడా చేయని ఈ వైసిపి నాయకులు అవాకులు చెవాకులు పేలుతున్నారని,రాష్ట్ర ప్రజలు వైసిపికి 11 సీట్లు ఇచ్చిన వీరికి బుద్దిరాలేదని ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో ఇన్ ఫోసిస్ వైస్ ఛాన్స్ లర్ వెంకటేశ్వర్లు,బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమార స్వామి,బిజెపి మైనార్టీ మోర్చ అధ్యక్షులు షేక్ బాజి,బిజెపి సీనియర్ నాయకులు పనతాల సురేష్ మరియు ఇతర ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here