15-10-2024
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గా మాజీ మంత్రి ఆలపాటి రాజా ని గెలిపించండి- సెంట్రల్ నియోజకవర్గానికి బొండా ఉమ పిలుపు
ది;15-10-2024 మంగళవారం ఉదయం 11:00″గం లకు” విజయవాడ సింగ్ నగర్ లోని టిడిపి సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరావు, కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్స్ MLC ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజా చే సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమం గురించి నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగినది.
ముందుగా ఈరోజు మాజీ రాష్ట్రపతి, మానవతావాది, స్ఫూర్తి ప్రదాత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బొండా ఉమ ఆలపాటి రాజా పూలమాలవేసి గన నివాళులు అర్పించడం జరిగినది…
అనంతరం బొండా ఉమా ఆలపాటి రాజా మాట్లాడుతూ:- నవంబరు 6 వరకు దరఖాస్తుకు అవకాశం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియో జకవర్గం పరిధిలో ఓటర్ల జాబితాకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందిఅని…
ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఓటరు నమోదు ప్రక్రియ ఇప్పటి కే సెంట్రల్ నియోజకవర్గంలో మొదలు అయింది అని, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా ప్రక్రియ అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం అయింది అని..
ఓటరు నమోదుకు సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ విడుదల 2024, అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటరు దరఖాస్తులు స్వీకరిస్తారు అని…
డిసెంబర్ 9వ తేదీ వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ డిసెంబర్ 25 నాటికి అభ్యంతరాల పరిష్కారం డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రకటన
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియో జకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు గతంలో పట్టభ ద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు నమోదు చేసు కున్న ఓటు ప్రస్తుతం ఉండదు అని…
వారు కూడా కచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాల్సిందే 2021, అక్టోబర్ నాటికి పట్టభద్రులైన వారు ఓటరుగా నమోదయ్యేందుకు అర్హులు అని…
దరఖాస్తులు సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం నందు కానీ తహసీల్దార్ కార్యాలయాల్లో అందించవచ్చు అని, లేకుంటే ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు ఇందుకు సంబంధించి ఫారం18, 19ని నమోదు చేసి ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తు చేసుకోవాలి అని…
ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ,ఎంపీ ఎలక్షన్స్ లో అత్యధికంగా ఓట్లు నమోదు కావడం విశేషమని ప్రజలందరూ కూడా కోటమీ ప్రభుత్వానికి ఓట్లు వేసి వారి గత అరాచక ప్రభుత్వ పాలన నుండి విముక్తి కావాలని ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా బోండా ఉమా మహేశ్వర రావు ని అలాగే విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా కేసినేని శివనాద్ (చిన్ని) ని అత్యధిక మెజారిటీతో గెలిపించారు అని…
ఇప్పుడు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకొని కూటమి ప్రభుత్వానికి మరల విజయాన్ని చేకూర్చాలని తెలియజేశారు…
ఈ కార్యక్రమంలో:-జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ,టిడిపి రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, భారతీయ జనతా పార్టీ సెంట్రల్ నియోజకవర్గ కన్వీనర్ నామిశెట్టి వెంకట్, ముప్ప వెంకటేశ్వర్లు,ఎరుబోతు రమణారావు, లుక్కా సాయిరాం గౌడ్, దాసరి ఉదయశ్రీ, సింగం వెంకన్న తో పాటు డివిజన్ పార్టీ ఇంచార్జ్ లు,డివిజన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్సులు ,కార్పొరేటర్లు, EX కార్పొరేటర్లు, క్లస్టర్, యూనిట్ అనుబంధ సంఘాల నాయకులు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు