Home Political news జగన్ పరిపాలనకు అర్హుడు కాదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

జగన్ పరిపాలనకు అర్హుడు కాదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

2
0

 జగన్ పరిపాలనకు అర్హుడు కాదు.

అప్పులు తేవడం బటన్ నొక్కడమే జగన్ కు తెలుసు.

కానీ సీఎం చంద్రబాబు సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తారు.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు

ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 19.10.2024.

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఏమాత్రం అర్హుడు కాదని, కేవలం అప్పులు తీసుకువచ్చి బటన్ నొక్కడం మాత్రమే అతనికి తెలుసని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు విమర్శించారు. 

ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఏపీకి పరిశ్రమలు తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కృషి జరుగుతుందన్నారు. 

సీఎం చంద్రబాబు టీడీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఏపీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుపై సుదీర్ఘమైన చర్చలు జరిపి అందరికి వివరణ ఇచ్చారని వెల్లడించారు. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా స్వచ్ఛమైన పరిపాలనందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.

గత ప్రభుత్వ పాలనలో అప్పటి సీఎం జగన్ కేవలం 15 నిమిషాల మాత్రమే ఎమ్మెల్యేల సమావేశంలో ప్రసంగించి వెళ్లిపోయేవారన్నారు. కానీ సీఎం చంద్రబాబు ఎంతో ఓపిగ్గా దాదాపు 7 గంటల సమయం పాటు అందరితో మాట్లాడారన్నారు.

జి.కొండూరు నుంచి దుగ్గిరాలపాడు వరకు రహదారి అభివృద్ధి పనులు, కందులపాడు నుంచి నాగులూరు వరకు విస్తరణతో కూడిన రహదారి అభివృద్ధి పనులను కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఆగిన అభివృద్ధి పనులన్నిటిని పూర్తి చేస్తామన్నారు.

వరద విపత్తు సాయం బాధితు కుటుంబాలు అందరికీ విడుదల చేశామన్నారు. రైతులకు కూడా పంట నష్టపరిహారం చెల్లించినట్లు వెల్లడించారు. నెల రోజుల వ్యవధిలోనే వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్నట్లు పేర్కొన్నారు.

జనరంజకంగా పరిపాలిస్తున్న సీఎం చంద్రబాబు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ అక్కల రామ్మోహన్రావు (గాంధీ) , ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here