కొత్తూరు తాడేపల్లిలో పల్లెపండుగ.
రహదారుల నిర్మాణానికి రూ.1.9 కోట్లు మంజూరు.
భూమిపూజ చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, 20.10.2024.
విజయవాడ రూరల్ మండలంలోని కొత్తూరు తాడేపల్లిలో 1527 మీటర్ల పొడవునా 5 రహదారుల నిర్మాణానికి రూ. 1.9 కోట్లు మంజూరు చేసినట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు వెల్లడించారు.
కొత్తూరు తాడేపల్లిలో పల్లెపండుగ కార్యక్రమంలో భాగంగా ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రహదారుల నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గంలో పల్లెపండుగ కార్యక్రమం ఘనంగా జరిగిందన్నారు. నేటితో ఈ కార్యక్రమం ముగుస్తుందన్నారు. రెండు వారాల్లో రహదారుల అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులకు, టీడీపీ, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు రికార్డు స్థాయిలో నిధులు కేటాయించిన సీఎం చంద్రబాబు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ అక్కల రామ్మోహనరావు (గాంధీ) ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.