Home public news వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.

3
0

 వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.

పొట్టి శ్రీ‌రాములు  చిత్ర‌ప‌టానికి   మాజీ మంత్రివర్యులు, PAC మెంబర్ వెలంపల్లి శ్రీ‌నివాసరావు  ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి  సెంట్రల్ ఇంచార్జ్ మ‌ల్లాది విష్ణు , మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు పూల మాలలు వేసి ఘన నివాళులార్పించారు

ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి పొట్టి శ్రీ‌రాములు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు

అనంత‌రం మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీ‌నివాసరావు  మాట్లాడుతూ..

ఆంధ్ర రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌ల‌ను కూట‌మి ప్ర‌భుత్వం విస్మ‌రించ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. పొట్టి శ్రీ‌రాముల‌కు ఇవాళ నివాళుల‌ర్పించ‌కాపోవడం దారుణ‌మ‌న్నారు. ఈ రోజు చంద్ర‌బాబు ఏపీకి ముఖ్య‌మంత్రిగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారంటే అది పొట్టి శ్రీ‌రాములు చేసిన త్యాగ‌ఫ‌ల‌మే అని గుర్తు చేశారు. ఎన్నిక‌ల ముందు అనేక‌మార్లు చంద్ర‌బాబు, ప‌వ‌న్ కూడా పొట్టి శ్రీ‌రాములు త్యాగ‌ఫ‌ల‌మే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఏర్ప‌డింద‌ని చెప్పారు. ఇవాళ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నివాళుల‌ర్పించే స‌మ‌యం లేదా అని ప్ర‌శ్నించారు. ఆర్య‌వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన పొట్టి శ్రీ‌రాములు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమ‌ర‌ణ నిరాహార‌దీక్ష చేశార‌ని తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వంలో మ‌న రాష్ట్రానికి అవ‌త‌ర‌ణ దినోత్స‌వం చేసుకోకపోవడం సిగ్గు చేటు అన్నారు. ఎన్నిక‌ల ముందు ఒక మాట ..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మ‌రోమాట మాట్లాడే కూట‌మి ప్ర‌భుత్వం ఇవాళ పొట్టి శ్రీ‌రాములును అయన త్యాగన్ని అవ‌మాన ప‌రిచింద‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్  అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆర్య‌వైశ్య‌లకు అనేక మేలు చేశార‌న్నారు. టీటీడీ బోర్డులో ఆర్య‌వైశ్యుల‌కు ఇవాళ అవ‌కాశం క‌ల్పించ‌లేద‌న్నారు.  వైయస్ రాజశేఖరరెడ్డి గాని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కాని పొట్టిశ్రీరాములుకి ఇచ్చిన గౌరవం రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ఇచ్చినట్లుగా తామంతా భావిస్తామన్నారు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు వారసులుగా నేడు ఆర్యవైశ్యులు కొనసాగుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి ఆ మహానుభావులు చేసిన సేవలే కారణమని అన్నారు. న‌వంబ‌ర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం జ‌ర‌పాల‌ని వెలంపల్లి శ్రీనివాసరావు  డిమాండు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here