Home Political news ఈ దీపావళి మహిళల కుటుంబాల్లో మరింత వెలుగును తీసుకోవచ్చింది

ఈ దీపావళి మహిళల కుటుంబాల్లో మరింత వెలుగును తీసుకోవచ్చింది

3
0

 *01.11.2024*

ఈ దీపావళి మహిళల కుటుంబాల్లో మరింత వెలుగును తీసుకోవచ్చింది

 

గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు వడ్రాణం హరిబాబు

ఎన్డీయే పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందని గన్నవరం నియోజక వర్గ పరిశీలకులు వడ్రాణం హరిబాబు అన్నారు. శుక్రవారం దీపం-2 పథకం లో భాగంగా గన్నవరం క్యాంప్ కార్యాలయం నందు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఆయన నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం మహిళలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుందన్నారు . ఈ దీపావళి ప్రతి ఇంట్లో మరింత వెలుగులు నింపిందని చెప్పారు. ఈ పథకం కింద ప్రభుత్వం అర్హత కలిగిన మహిళలకు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించనుందని తెలిపారు .గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్‌కు చెల్లించిన సొమ్ము వారి ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు . ఈ పథకం ద్వారా మహిళల కుటుంబ వ్యయాలు తగ్గుతాయని, వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని  అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం లో ఎమ్మార్వో శివయ్య , గన్నవరం హెచ్ పి గ్యాస్ డీలర్ ప్రసాద్ , రాష్ట్ర టిడిపి కార్యదర్శి దొంతు చిన్న, గన్నవరం మండల టిడిపి అద్యక్షులు జాస్తి వెంకటేశ్వరరావు, విజయవాడ రూరల్ మండల టిడిపి అద్యక్షులు గొడ్డళ్ళ చిన్న రామారావు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు గుజ్జర్లపూడి బాబూరావు, జూపల్లి సురేష్, తెలుగు మహిళా నేతలు మండవ లక్ష్మీ, మేడేపల్లి రమ, సులోచన దేవి, చిక్కవరపు నాగమణి, కాట్రగడ్డ అరుణ, టిడిపి నాయకులు బోడపాటి రవికుమార్, జాస్తి మురళి, ఆరుమళ్ళ వెంకట కృష్ణారెడ్డి, షేక్ ఫిరోజ్, మండవ అన్వేష్, బుస్సే నాగ ప్రసాద్, తంగిరాల శ్రీనివాసరావు, కంచర్ల సూర్య , బిజెపి గన్నవరం మండల అద్యక్షులు అనపరెడ్ఢి చంద్రశేఖర్ రెడ్డి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చిమట రవివర్మ , కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here