*04.11.2024*
టిడిపి ఎన్నారై డాల్లస్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ కు అత్మీయ అభినందన సభ
పెద్ద ఎత్తున పాల్గొన్న ఎన్నారైలు
అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బిజెపి తరపున కూటమి అభ్యర్థిగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో విజయాన్ని సాధించిన యార్లగడ్డ వెంకట్రావు మొదటిసారిగా ఆమెరికా పర్యటనకు వెళ్ళారు . అమెరికా వచ్చిన యార్లగడ్డ కు ఎన్నారై టిడిపి డాల్లాస్ ఆద్వర్యంలో టెక్సాస్ లో మీట్ అంట్ గ్రీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్య లో ఎన్ఆర్ఐ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ సందర్బంగా వేద పండితులు యార్లగడ్డకు పూర్ణ కుంబంతో స్వాగతం పలికారు .అనంతరం తెలుగు దేశ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలతో ఘన వివాణులు అర్పించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ మాట్లాడుతూ తన గెలుపు కోసం పత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందజేసిన ఎన్నారైలకు కృతజ్ణతలు తెలిపారు . దివంగత ఎన్టీఆర్ తో తన కుటుంబ సభ్యులకు అత్మీయ సత్సంబదాలు ఉండేవన్నారు . విజ్ణులైన గన్నవరం నియోజక వర్గ ప్రజలకు తనకు అందించిన అఖండ విజయానికి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు .యువత ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు . గన్నవరం నియెజకవర్గాన్ని రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘటించారు .