శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
ఈరోజు జయప్రకాశ్ నగర్, విజయవాడ-08 కు చెందిన నువ్వుల భాస్కర్ రావు, విజయలక్ష్మి కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దేవస్థానం నందు జరుగు అన్నదానం నిమిత్తం నువ్వుల దుర్గ చంద్ర కౌశిక్, రవళి పేరున అన్నదానం జరుపుటకు గాను ఆలయ ఈవో కె ఎస్ రామరావు ని కలిసి రూ. 1,01,116/- లను విరాళంగా అందజేశారు.
అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులచే వేదార్వచనం కల్పించగా ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, పుస్తకములు మరియు చిత్రపటం అందజేశారు.