CPI
సర్దుబాటు చార్జీలు కాదు – ప్రజలకు సర్దు పోటు
ప్రజలను మోసం చేసినకూటమి ప్రభుత్వం
విజయవాడ బ్రహ్మానంద రెడ్డి నగర్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వద్ద బైఠాయించిన సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్
కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజలను పోటు పొడిచిందని ఇది సర్దుబాటు కాదని సర్దు పోటు అని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ట్రూ ఆప్ ఛార్జీలు తక్షణమే ఉపసంహరించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి పిలుపు మేరకు విజయవాడ, చుట్టుగుంట, బ్రహ్మానందరెడ్డి నగర్ చుట్టుగుంట సబ్ స్టేషన్ వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ బైఠాయించారు. చుట్టుగుంట విశాలాంధ్ర కార్యాలయం వద్ద నుండి బ్రహ్మానంద రెడ్డి నగర్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ వరకు పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
అనంతరం సబ్స్టేషన్ అధికారి కార్యాలయం లో బైఠాయించారు.అనంతరం సబ్ స్టేషన్ అధికారికి వినతి పత్రం అందజేశారు.
సిపిఐ విజయవాడ నగర కార్యదర్శి వర్గ సభ్యుడు అప్పర్బోతు రాము అధ్యక్షతన జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడారు.
ఎన్డీఏ కూటమి టిడిపి,బిజెపి జనసేన ప్రభుత్వం ప్రజలను మోసగించిందనీ,ఎన్నికల మేనిఫెస్టోను కూటమి ప్రభుత్వం 4నెలల్లోనే తుంగలో తొక్కిందనీ విమర్శించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని చెబుతూ డిస్కములకు లబ్ధి చేకూర్చే విధంగా సుమారు 18 వేలకోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన వేసిందని ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు ఎన్డీఏ ప్రభుత్వం పెంచదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పలు సభల్లో మాట్లాడారని ఎన్నికల
వాగ్దానాలు ముడ్నాళ్ళ ముచ్చటేనా అని ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు తాను అధికారంలోకి రావడానికి కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మరొకసారి మభ్య పెట్టారని ఇది కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన దీపావళి బోనస్ గా ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే డిస్కం లకు చెల్లించవలసిన 18 వేల కోట్ల రూపాయలను ప్రజల మీద భారం మోపకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు చర్యలు చేపట్టాలని తాను అధికారంలోకి రావడానికి అనేక రకాల వాగ్దానాలు చేసి నేడు చేసిన వాగ్దానాలను అమలు చేసే ధైర్యం లేక ప్రజల మీద భారాలు మోపడం ఎన్డీఏ కూటమి పెద్దలకు తగదని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శులు లంక దుర్గారావు, నక్క వీరభద్రరావు లు మాట్లాడుతూ సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నెత్తిన వేలకోట్ల రూపాయల భారాన్ని మోపడం సరికాదని సంక్షేమ పథకాలు అమలుకు ప్రజలందరూ సహకరించాలని ఒకపక్క చెప్తూ మరొకపక్క పథకాలకు ప్రజల మీదే భారాన్ని మోపడం సిగ్గుచేటని విమర్శించారు. తక్షణమే సర్దుబాటు చార్జీల భారాన్ని ప్రజల మీద పడకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఇజ్జాడ లక్ష్మి,సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు కొడాలి.అనందరరావు, ఓర్సు భారతి, దుగ్గిరాల సీతారావమ్మ, తూనం వీరయ్య, దోనేపూడి సూరిబాబు, నగర నాయకులు కొండపల్లి కృష్ణ, లక్ష్మణ రావు, అలీ, కరుణా కర్, పడాల భాగ్యలక్ష్మి, ఆటో యునియాన్ నాయకులు గుడేల జనార్దన్, వేంకచ్చి, పత్తికాయల శివా, కే. విజయ్, ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ కె కార్తీక్, ఎ ఐ వై ఎఫ్ నగర ఉపాధ్యక్షులు చిరుతోటి శ్రీధర్, పత్తిపాటి రాజు,మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.