మీరు సమస్య గుర్తించండి
నేను చేయిస్తా…
పశ్చిమ కార్పొరేటర్లకు ఎమ్మెల్యే సుజనా చౌదరి భరోసా..
వెస్ట్ నియోజక వర్గాన్ని బెస్ట్ గా తీర్చి దిద్దేందుకు
ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో పనిచేయాలనీ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపు నిచ్చారు..
పశ్చిమ నియోజకవర్గ కూటమి కార్పొరేటర్లు, నేతలతో క్యాంప్ కార్యాలయంలో సుజనా చౌదరి సమావేశమయ్యారు..ఈ సందర్భంగా నియోజకవర్గంలోని కొండ ప్రాంతాల్లో తాగునీరు, డ్రైనేజ్ సమస్యలను కార్పొరేటర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు..
కొండ ప్రాంతాల్లో ఇంజనీరింగ్, సివిల్ పనులు చేసేందుకు మెటీరియల్ లిఫ్ట్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సుజనా ఫౌండేషన్ ద్వారా ఒక ప్రాంతంలో పైలట్ ప్రా గా లిఫ్ట్ ను ఏర్పాటు చేయనున్నట్లు చౌదరి తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని దీర్ఘ కాలిక సమస్యలను తన దృష్టికి తీసుకు వస్తె పరిష్కారం చేస్తానని తెలిపారు.. సమస్య ను క్షుణ్ణంగా పరిశీలించి తన దృష్టికి తీసుకు వస్తె అది ప్రభుత్వం ద్వారా పరిష్కారం కాకపోతే తమ సొంత నిధులతో పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.. విద్య, వైద్యం రంగాలలో సైతం సమూల మార్పులు తెచ్చి
పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు..స్థానిక ప్రజా ప్రతినిధులంతా ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపునిచ్చారు.
నియోజకవర్గంలోని 22 డివిజన్లలో ఎమ్మెల్యే కార్యాలయం తరపున సమన్వయ కర్తలను నియమిస్తున్నట్లు తెలిపారు..
ప్రజలకు, కార్పొరేటర్లు కు అనుసంధానంగా కూటమి నాయకులు పని చేస్తారని వెల్లడించారు..
కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉమ్మడి చంటి, బుల్లా విజయ్, గుడివాడ నరేంద్ర రాఘవ, హర్షద్, అప్పాజీ రావు, మైలవరపు రత్నకుమారి, అత్తులూరి ఆదిలక్ష్మి, మైలవరపు మాధురి లావణ్య, కూటమినేతలు మైలవరపు దుర్గారావు, పైలా సురేష్, మైలవరపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.