08-11-2024
డూండీ రాకేష్ ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించిన ఎంపి కేశినేని శివనాథ్
రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యాలయం ప్రారంభం
వాణిజ్య రంగానికి విజయవాడ ప్రధాన కేంద్రం
విజయవాడ : గత ప్రభుత్వం కారణంగా వాణిజ్య రంగానికి ప్రధాన కేంద్రమైన విజయవాడలో చాలా మంది వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి అండగా నిలబడి,నిరంతరం వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరిచేందుకు ముందుండే టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్ ప్రజాసేవ చేయటానికి ముందుకి రావాలని విజయవాడ ఎంపి కేశినేని ఆకాంక్షించారు.
పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురం ఆర్టీసీ డిపో ఎదురుగా డూండీ రాకేష్ ఏర్పాటు చేసిన టిడిపి రాష్ట్ర వాణిజ్య విభాగ నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపి కేశినేని శివనాథ్ ప్రారంభోత్సవ పూజ కార్యక్రమాల్లో పాల్గొని రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సంధర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ డూండీ రాకేష్ కి భవిష్యత్తులో మంచి పదవులు వచ్చే అవకాశం వుందన్నారు. రాష్ట్రంలో వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా పోరాటం చేస్తున్నాడో..అదే విధంగా ప్రజాసేవ చేయటానికి ముందడుగు వేయాలన్నారు. రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు
అనంతరం రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్ గత ప్రభుత్వంలో వ్యాపారస్తులు వ్యాపారం చేయటానికి భయపడే పరిస్థితి వుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాతే వ్యాపారస్తులు భయపడకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారన్నారు.తనకి అండగా వుంటూ రాజకీయంగా తగు సూచనలు, సలహాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఎంపి కేశినేని శివనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈకార్యక్రమంలో విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గడ్డం రవి, విజయవాడ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ, టిడిపి అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, జిల్లా మీడియా కో-ఆర్డినేటర్ యేదుపాటి రామయ్య, టిడిపి నాయకులు పత్తి నాగేశ్వరరావు, మోరబోయిన రాంబాబు, నూకల నాగేశ్వరరావు, కోణిజేటి రమేష్, కారంశెట్టి రాధ, సీనియర్ నాయకులు ఎమ్.సుబ్బయ్య, క్రిస్టియన్ సెల్ నాయకులు కామా దేవరాజు పాల్గొన్నారు.