*16.11.2024*
మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ కు రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ గా నామకరణం చేయాలి
మల్లవల్లి పారిశ్రామిక వాడ రానున్న రోజుల్లో రాష్ట్రానికే తలమానికంగా మారుతుంది
మల్లవల్లి పారిశ్రామిక వాడ ఫెస్ -2 కు తగిన భూమిని కేటాయించండి
గన్నవరం నియోజక వర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్
కూటమి ప్రభుత్వం బడ్జెట్ లో పరిశ్రమలకు 4370 కోట్లకు పైగా నిధులు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు కు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు . శనివారం ఆయన అసెంబ్లీ సమావేశాలలో మల్లవల్లి పారిశ్రామిక క్యారిడర్ అభివృద్ది పై ప్రసంగించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లవల్లి పారిశ్రామికవాడ లో పారిశ్రామిక వేత్తలకు 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో 16.5 లక్షల కు ఎకరం కేటాయిస్తే గత వైసీపీ ప్రభుత్వం 89.5 లక్షలకు పెంచిందని మండిపడ్డారు .గత వైసిపి ప్రభుత్వ తీరు కారణంగా పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం నుండి పారిపోయిన పరిస్ధితి నెలకోందని వాపోయారు . ప్రముఖ దిగ్గజ కంపెని అశోక్ లే లాండ్ కంపెని ప్రారంభానికి సిద్ధంగా గత ప్రభుత్వ తీరు వల్ల వెన్నకి వెళ్లారని విమర్శలు చేశారు .మల్లవల్లి పారిశ్రామిక వాడ సెకండ్ ఫెస్ కోసం జిల్లా అధికారులతో సంప్రదించి తగిన భూమి ని గుర్తించాలని కోరారు . రానున్న రోజుల్లో మరిన్ని పరిశ్రమలు మల్లవల్లి కి వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయని చెప్పారు .తాను గన్నవరం నియోజకవర్గంలో 15 వేల ఉద్యోగాలు కల్పించకపోతే తాను వచ్చే ఎన్నికలో ఓటు అడిగానని చెప్పానని చెప్పారు. మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ కు రతన్ టాటా మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ గా నామకరణం చేయాలనీ కోరారు . .రాష్ట్రాన్ని అన్ని విధాలా వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని ద్వజమెత్తారు . అక్రమ కేసులు పెట్టడం మీద ఉన్న శ్రధ్ద రాష్ట్ర అభివృద్ది పై పెట్టలేదని అన్నారు . డబ్బులు దండుకోవడమే పనిగా అప్పటి నాయకులు పనిచేశారని విమర్శలు చేశారు . భౌగోళికంగా అభివృధి చెందే మల్లవల్లి పారిశ్రామికవాడ పూర్తి స్ధాయిలో అభివృద్ది చెందే విధంగా అన్ని మౌలీక సదుపాయాలు కల్పించాలని.. తగిన భూమి ని కేటాయించాలని ఆయన ముఖ్యమంత్రి , సంబందిత మంత్రి ని కోరారు