21-11-2024
రూ.1లక్ష యాభై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి అందజేత
విజయవాడ : రెండు కిడ్నీలు ఫెయిలై అనారోగ్యంతో భాదపడుతూ హైదరాబాద్ లో నిమ్స్ చికిత్స పొందుతున్న కొప్పనాతి నాగలక్ష్మీ తన కిడ్నీ ఆపరేషన్ కోసం తక్షణ ఆర్ధిక సాయం కోరుతూ సీఎంఆర్ఎఫ్ కింద లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్.వో.సి) కి ఎంపి కేశినేని శివనాథ్ సాయంతో ఆర్జీ పెట్టుకున్నారు…ఈ మేరకు మంజూరైన రూ.1లక్ష యాభై వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్.వో.సి పత్రాన్ని గురువారం కొప్పనాతి నాగలక్ష్మీ కుమారుడు కొప్పనాతి శ్యామ్ సుందర్ కి ఎంపి కార్యాలయ సిబ్బంది అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులు ఎంపి కేశినేని శివనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వో.ఎస్.డి ఎ.వెంకటరత్నం,ముల్పూరి కిషోర్ పాల్గొన్నారు.