ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 21.11.2024.
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో నిర్మించిన రహదారుల మరమ్మత్తుల గురించి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే రహదారులకు మరమ్మత్తులు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.