Home Political news శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు 30 సంవత్సరాల నుంచి పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను

శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు 30 సంవత్సరాల నుంచి పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను

3
0

 21-11-2024

ధి:21-11-2024 గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సెషన్స్ నందు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు 30 సంవత్సరాల నుంచి పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను

రెగ్యులరైజ్ చేసి, రిజిస్ట్రేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీలో కోరడం జరిగింది

 2014 TO 2019 లో వైయస్సార్సీపీ ప్రభుత్వంలో గాని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో గాని పేదవారికి తెల్ల పట్టాలు రెగ్యులరైజేషన్ చేస్తామని గతంలో అనేక జీవోలు ఇచ్చామని, సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో తాను శాసనసభ్యులుగా ఉన్న సమయంలో 74 జీవో, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 105 ఇచ్చినాయని,

 గత 30 సంవత్సరాల ముందు ఇచ్చిన పట్టాలకు కూడా ఇప్పటికీ రిజిస్ట్రేషన్లు లేవు అని, సెంట్రల్ నియోజకవర్గంలో మధురానగర్ తుంగం రాముల వారి వీధి, దేవినేని గాంధీ పురం, LBS నగర్, పాకిస్తాన్ కాలనీ, నందమూరి నగర్ వంటి ప్రాంతాలలో మూడు వేల నుండి 4 వేల పట్టాలు జీవో నెంబర్ 74 తో 2019 జనవరిలో సాంక్షన్ చేయడం జరిగినదని.

  ఎలక్షన్స్ రావడం, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో పనులన్నీ ఆగిపోవడం జరిగినదని, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ పనులను ముందుకు సాగడానికి చూస్తా ఉంటే మునిసిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎవరూ సహకరించటం లేదని

 40 సంవత్సరాల క్రితం పేదవారికి 40 గజాలు నుండి 50 గజాలు ఇచ్చినటువంటి పట్టాలకు కూడా ఇంతవరకు రిజిస్ట్రేషన్లు కాకపోవడం అనేది అధికారుల నిర్లక్ష్యానికి కారణమని, ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని వెళ్ళడం త్వరలోనే సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరైతే పేదవారు నివసిస్తున్నటువంటి పట్టా భూములకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా అసెంబ్లీలో బొండా ఉమా కోరడం జరిగినది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here