Home Political news సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయిలకు పెంపు. ...

సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయిలకు పెంపు. జేఏసీ నాయకులతో కుదిరిన ఒప్పందం

2
0

 సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయిలకు పెంపు.

జేఏసీ నాయకులతో కుదిరిన ఒప్పందం

– సమ్మె విరమణ

తద్వారా 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి

ఆహారం,పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్

కూలి రేటు పెంపుపై హర్షం వ్యక్తం చేసిన జేఏసీ నాయకులు

పౌరసరఫరాల ముఠా కార్మికులకు భవిష్యత్తులో మరింత మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హామీనిచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్

అమరావతి: సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు రూ. 3 పెంచడం ద్వారా 252 ఎమ్ ఎల్ ఎస్ పాయింట్లలో పని చేస్తున్న 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి చేకూరుతుందని ఆహారం, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. హామాలీల కూలీ రేటు పెంచాలని జేఏసీ నాయకులు అభ్యర్థన మేరకు పౌర సరఫరాల శాఖ ముఠా కార్మికుల జేఏసీ నాయకులతో వెలగపూడి సచివాలయం 2వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితో చర్చలు జరిపిన అనంతరం హమాలీల కూలీ రేటు క్వింటాకు రూ. 25 నుండి రూ. 28కి పెంచేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పలు సమస్యలను మంత్రి నాదెండ్ల దృష్టికి తీసుకురాగా మంత్రి సావధానంగా విన్నారు. మరో సమావేశంలో సంబంధిత సమస్యలపై లోతుగా చర్చించి పరిష్కరిద్దామని వివరించారు. మంత్రి నిర్ణయంతో జేఏసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.  

ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ

సివిల్ సప్లైస్ హమాలీలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. కూటమి ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభం లో ఉన్నా హమాలీలకు కూలీ రేటు పెంచిందన్న విషయం గుర్తుచేశారు. పౌరసరఫరాల ముఠా కార్మికులకు భవిష్యత్తులో మరింత మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 

ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీరపాండియన్ ఐఏఎస్, ఎండీ. మన్ వీర్ జిలానీ ఐఏఎస్, సీఐటీయూసీ అధ్యక్షులు ఉమ మహేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి ఉదయ్ భాస్కర్ రావు, రాష్ట్ర నాయకులు శేఖర్, శివ శంకర్, పీవీ.యోహాన్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు చిన్న ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య, ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజిబాబు, రాష్ట్ర నాయకులు, కోట్ల మరియ దాసు, బండారు శ్రీను బాబు , భాష, లక్ష్మణ్ రావు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here