Home Andhra Pradesh ప్రత్యేక ఆకర్షణగా గాంధీ కొండ ప్లానిటోరియం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

ప్రత్యేక ఆకర్షణగా గాంధీ కొండ ప్లానిటోరియం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

3
0

 ప్రత్యేక ఆకర్షణగా గాంధీ కొండ ప్లానిటోరియం

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజ‌య‌వాడ:- గాంధీ కొండ వద్ద ఉన్న ప్లానిటోరియం విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర అన్నారు. సోమవారం నాడు విడుదల చేసిన ప్రకటనలో వన్‌టౌన్ గాంధీ హిల్‌లో ఉన్న ప్లానిటోరియంలో ప్రజలు ఇకపై వీక్షించవచ్చన్నారు. ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించే గాంధీ హిల్‌లో అంతరిక్ష పరిజ్ఞానం పెంచేందుకు ఏర్పాటు చేసిన ప్లానిటోరియంను ప్రజలందరూ వీక్షించాల‌ని కోరారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు రూ.40 ప్రవేశ టికెట్‌గా పెట్టినట్లు తెలిపారు. 63 సిట్టింగ్ కెపాసిటీ గల ప్లానిటోరియంను ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు కు అందుబాటులోకి తీసుకురావాలని ఉద్దేశంతో, పాఠశాలల నుండి ప్రత్యేక బుకింగ్ చేసుకున్న వారికి 50శాతం ప్రవేశ రుసుములో రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుండి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ప్రతి అరగంటకు షో వేస్తున్నట్లు తెలిపారు. పాఠశాల/ కళాశాలలు నుండి ప్రత్యేకంగా బుకింగ్స్ చేసుకున్న వారికి ఉదయం నుండి సాయంత్రం వరకు వారు బుకింగ్ చేసుకున్న సమయంలో షో వేస్తామని తెలిపారు. ప్రతి మంగళవారం నిర్వహణ కొరకు సెలవు అని అన్నారు. విజయవాడలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న గాంధీ కొండ ప్లానిటోరియంలో వీక్షించి అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని ప్రజలందరినీ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here