Home Political news ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీలో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు.

3
0

 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్  ఈ రోజు ఢిల్లీలో  భారత ఆర్థిక మంత్రి  నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి ఏఐఐబీ రుణంలో వెసులుబాట్లు కోరారు.

* ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రోడ్ల ప్రాజెక్ట్ (ఏపీఆర్‌ఆర్‌పీ) కోసం ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ & ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) నుంచి  తీసుకొన్న రుణానికి సంబంధించి ప్రాజెక్టును 31 డిసెంబర్ 2026 వరకు పొడిగింపు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్ట్‌లో మార్పుల కోసం విన్నవించారు.

* ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 31 డిసెంబర్, 2024 వరకు ఇచ్చిన ప్రస్తుత గడువు సరిపోదు. 

* రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రీయింబర్స్‌మెంట్‌ పద్దతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని కోరుచున్నాము. 

*  డిసెంబర్ 2026 వరకు ప్రాజెక్ట్ పొడిగింపు ఇవ్వగలరు

* నిధుల చెల్లింపుల విధానంలో మార్పులు చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రస్తుతం ఉన్న 70% (AIIB) :30 %+ పన్నులు (AP ప్రభుత్వం) విధానం నుంచి 90% (AIIB) :10% (AP ప్రభుత్వం) మార్పు చేసి..  455 మిలియన్ US డాలర్ల  (అంటే రూ. 3834.52 కోట్లు) బ్యాంక్ ఒప్పుకొన్న మేరకు వాటాను కొనసాగిస్తూ నిధుల విడుదలను మార్పును పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here