Home Political news స‌మాన‌త్వంతో కూడిన అభివృద్ది సాధించ‌ట‌మే టిడిపి లక్ష్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

స‌మాన‌త్వంతో కూడిన అభివృద్ది సాధించ‌ట‌మే టిడిపి లక్ష్యం : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

3
0

 26-11-2024

స‌మాన‌త్వంతో కూడిన అభివృద్ది సాధించ‌ట‌మే టిడిపి లక్ష్యం  : ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) 

సంవిధాన్‌ సదన్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విజ‌య‌వాడ ఎంపి 

ఢిల్లీ :  విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్  భార‌త‌  రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం సంవిధాన్ సదన్ (పాత పార్లమెంట్ )  ప్రాంగణంలోని సెంట్రల్‌ హాల్‌లో నిర్వ‌హించిన  ప్రత్యేక వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్రమానికి పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ ఆన్ ఢిపెన్స్ ఛైర్ ప‌ర్స‌న్  రాధ‌మోహ‌న్ సింగ్ తో పాటు టిడిపి సహచర ఎంపీలతో క‌లిసి పాల్గొన‌టం జ‌రిగింది.  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము  నేతృత్వంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ఉప రాష్ట్రపతి జగదీప్

   ధనఖ‌డ్, ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ, లోక్ స‌భ‌ స్పీకర్ ఓం బిర్లా తో సహా లోక్ స‌భ రాజ్యసభ సభ్యులంతా పాల్గొన్నారు. 

75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొన‌టం ఎంతో ఆనందంగా, గ‌ర్వంగా వుంద‌ని ఎంపి కేశినేని అన్నారు    డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో  రూపొందించుకున్న భారత రాజ్యాంగం, ప్రపంచంలోని  ప్రజాస్వామ్య దేశాలకి భార‌త రాజ్యాంగం  దిక్సూచి గా నిల‌బ‌డింద‌న్నారు.  రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంద‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here