Home Andhra Pradesh చైన్ స్నాచింగ్ కేసులలో నలుగురు నింధితులు అరెస్ట్ వద్ద నుండి సుమారు 30 లక్షల...

చైన్ స్నాచింగ్ కేసులలో నలుగురు నింధితులు అరెస్ట్ వద్ద నుండి సుమారు 30 లక్షల రూపాయల విలువైన 476 గ్రాముల బంగారు

3
0

ఎన్.టి.ఆర్.పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ తేదీ.28.05.2025. చైన్ స్నాచింగ్ కేసులలో నలుగురు నింధితులు అరెస్ట్ వద్ద నుండి సుమారు 30 లక్షల రూపాయల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలు రెండు మోటార్ సైకిల్స్ స్వాదీనం.ఎన్.టి.ఆర్ జిల్లా నందు జరుగుతున్న దొంగతనాలు మరియు చైన్ స్నాచింగ్ ల ను నివారించడంలో ప్రత్యేక దృష్టి సారించి నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని పోలిస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు క్రైమ్ డి.సి.పి. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. సూచనలతో క్రైమ్ ఏ.డి.సి.పి. ఎం.రాజరావు ఎ.సి.పి. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిదిలో పలు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృంధాలకు సాంకేతికంగా రాబడిన పక్కా సమాచారం మేరకు సి.సి.ఎస్. ఇన్స్పెక్టర్ రామ్ కుమార్ మరియు వారి సిబ్బందితో కలిసి ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం బస్ స్టాప్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తనిఖీని గమనించి అనుమానాస్పధంగా పారిపోతున్న నలుగురు వ్యక్తులను అదుపులో తీసుకొని విచారించగా వీరి వద్ద నుండి 25 చైన్ స్నాచింగ్ కేసులలోని సుమారు 30 లక్షల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు రెండు మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకొని అరెస్టు చేయడం జరిగింది.*నిందితుల వివరాలు:*1. నెల్లూరు జిల్లా, ఉప్పుటూరు గ్రామానికి చెందిన ఆచ్చి గిరిబాబు(36 సం.) 2. నెల్లూరు జిల్లా, ఉప్పుటూరు గ్రామానికి చెందిన ఆచ్చి మహేశ్ (21 సం.)3. ఎన్.టి.ఆర్. జిల్లా , దొనబండ కు చెందిన గాలేటి వెంకట రమణ (38 సం)4. ఎన్.టి.ఆర్ జిల్లా , కొండపల్లి కి చెందిన మొగిలి సంధ్య (38 సం)(ప్రస్తుతం వీరందరూ ఎన్.టి.ఆర్. జిల్లా , ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిదిలో కొండపల్లి, దొనబండ ప్రాంతాలలో నివసిస్తున్నారు.)*విచారణలో*నిందితుడైన ఆచ్చి గిరిబాబు నెల్లూరు జిల్లా, ఉప్పుటూరు గ్రామంలో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ, ఈ క్రమంలో అతను జల్సాలు మరియు చెడు వ్యసనాలు అలవాటు పడినాడు, వచ్చే డబ్బులు తన జల్సాలకు సరిపోక ఏ విధంగానైనా సులభంగా డబ్బు సంపాదించి జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒంటరిగా ఉన్న మహిళల మెడలోని బంగారు ఆభరణాలను లాక్కొని వెళ్లిపోవాలని నిర్ణయించుకొని తనకు ఉన్న యూనికాన్ బైక్ తో వారి ఊరి చుట్టుపక్కల గ్రామాలలో తిరుగుతూ ఎక్కడైనా ఒంటరిగా పెద్ద వయసు మహిళలు కనబడితే అదును చూసుకొని వారి మెడలోని చైన్ లాక్కొని పారిపోతుంటాడు . ఈ క్రమంలో తను గతంలో నివాసం ఉన్న నెల్లూరు జిల్లా పరిసర గ్రామాలలో 12 చైన్ స్నాచింగ్ నేరాలు చేసి అరెస్ట్ కాబడి జైలుకు వెళ్లి వచ్చినాడు. జైలు నుండి విడుదలైన అనంతరం అక్కడ మళ్ళి స్నాచింగ్ లను చేస్తే దొరికిపోతాను అనే భయంతో తన రెండవ భార్య అయిన వెంకట రమణమ్మ ఉంటున్న ఎన్.టి.ఆర్.జిల్లా కొండపల్లిలో కొంత కాలం ఉంటూ ఆ తరువాత దొనబండ వచ్చి అక్కడ నివసిస్తూ ఈ క్రింది తెలిపిన 25 నేరాలను చేసాడు. ఈ విధంగా గిరిబాబు ఒక్కడే తన మోటార్ సైకిల్ పైన 15 స్నాచింగ్ నేరాలు చేశాడు, మరియు అతని తమ్ముడు అయిన మహేష్ తో కలిసి నాలుగు స్నాచింగ్ నేరాలు, అతని భార్య వెంకట రమణతో కలిసి 03 స్నాచింగ్ నేరాలు మరియు అతని మరదలు అయిన మొగిలి సంధ్య తో కలిసి 03 చైన్ స్నాచింగ్ నేరాలు మొత్తం 25 చైన్ చైన్ స్నాచింగ్ నేరాలు చేసి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం చేసేవారు. ఈక్రమంలో వీరు ఎన్.టి.ఆర్. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ పరిదిలో -2, జగ్గయ్య పేట సర్కిల్ పరిదిలో -3, మైలవరం సర్కిల్ పరిదిలో -4, తిరువూరు సర్కిల్ పరిదిలో -3, మొత్తం -12 చైన్ స్నాచింగ్ నేరాలు, కృష్ణాజిల్లా పరిధిలో-4 చైన్ స్నాచింగ్ నేరాలు, ఏలూరు జిల్లా లో పరిధిలో -2 చైన్ స్నాచింగ్ నేరాలు మరియు తెలంగాణ రాష్ట్రంలో -7 చైన్ స్నాచింగ్ నేరాలు మొత్తంగా 25 చైన్ స్నాచింగ్ నేరాలు చేసినారు.ఈ సందర్భంగా చైన్స్ స్నాచర్స్లను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్ఐలు బాలయ్య , స్వామి, సత్యనారాయణ,హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్స్ మిథున్, సురేష్ , షబ్బీర్, రమణ లను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ప్రత్యేకంగా అభినందించారు .ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ తో పాటు, క్రైమ్ డి.సి.పి. తిరుమలేశ్వర రెడ్డి ఐ.పి.ఎస్. క్రైమ్ ఏ.డి.సి.పి. శ్రీ ఎం.రాజరావు ఎ.సి.పి. వెంకటేశ్వర్లు ఇన్స్పెక్టర్ రామ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here