Home Political news మహాత్మా జ్యోతిరావు ఫూలే భారత దేశానికీ అందించిన సేవలు చిరస్మరణీయం – వెలంపల్లి శ్రీనివాసరావు

మహాత్మా జ్యోతిరావు ఫూలే భారత దేశానికీ అందించిన సేవలు చిరస్మరణీయం – వెలంపల్లి శ్రీనివాసరావు

3
0

 విజయవాడ

28-11-2024

మహాత్మా జ్యోతిరావు ఫూలే  భారత దేశానికీ అందించిన సేవలు చిరస్మరణీయం – వెలంపల్లి శ్రీనివాసరావు

మహాత్మా జ్యోతిరావు ఫూలే  ఆశయాలను, ఆలోచనలను అమలుపరిచిన వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి  – వెలంపల్లి శ్రీనివాసరావు

ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన సమయంలో మేనిఫెస్టోలోని అన్ని పధకాలను అమలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి  – వెలంపల్లి శ్రీనివాసరావు

మహిళలను, విద్యార్థులను, యువతను అన్ని రంగాల వారిని సూపర్ సిక్స్ హామీలు పేరుతొ కూటమి ప్రభుత్వం మోసం చేసింది  – వెలంపల్లి శ్రీనివాసరావు

నీకు 15 వేలు నీకు 18 వేలు,నీకు 40 వేలు నీకు 50 వేలిని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రతిఒక్కరిని మోసం చేసింది – వెలంపల్లి శ్రీనివాసరావు

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అణగదొక్కడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది – వెలంపల్లి శ్రీనివాసరావు

ఎంతో దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది  – వెలంపల్లి శ్రీనివాసరావు

పవన్ కళ్యాణ్  ఎప్పుడు ప్రశ్నించడమేనా ! డిప్యూటీ సియం గా ఉండి ఇతరుల ప్రశ్నలకు కూడా అయన సమాధానం చెప్పాలి – వెలంపల్లి శ్రీనివాసరావు

పవన్ కళ్యాణ్  ఢిల్లీకి చక్కర్లు కొడుతూ, ఢిల్లీలో కూర్చొని ఈ ఆరు నెలలో రాష్టానికి ఏమి చేసారో చెప్పాలి – వెలంపల్లి శ్రీనివాసరావు

ప్రతి రోజు చిన్న పిల్లల మీద అత్యాచారాలు అఘాయాత్యాలు జరుగుతున్నాయి  – వెలంపల్లి శ్రీనివాసరావు 

మహిళా హోమ్ మంత్రి  ప్రెస్ మీట్ లకే పరిమితమయ్యారు, కేవలం ప్రతిపక్షాలను తిట్టడంలోనే నిమగ్నమయ్యారు – వెలంపల్లి శ్రీనివాసరావు 

మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే దాక భయపడాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతుంది  – వెలంపల్లి శ్రీనివాసరావు 

ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆడార్ ని సరైన పద్దతిలో అమలుపరచాలి  – వెలంపల్లి శ్రీనివాసరావు 

ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించిపోయాయి  వెలంపల్లి శ్రీనివాసరావు 

భారత దేశంలోనే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కింది   వెలంపల్లి శ్రీనివాసరావు

స్థానిక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్, చర్చ్ సెంటర్, విఎంసి ఫంక్షన్ హల్ రోడ్ నందు గల మహాత్మా జ్యోతిరావు ఫూలే  విగ్రహం వద్ద భవానీపురం బిసి వెల్ఫేర్ అసోసియేషన్ వారి అధ్యక్షులు బెవరనాగేశ్వర రావు  ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు ఫులే  వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్, పిఎసి మెంబర్ వెలంపల్లి శ్రీనివాసరావు  మహాత్మా జ్యోతి రావు ఫూలే  విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించి అయన భారత దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు

ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు  మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే గారని అన్నారు, అయన ఈ దేశానికీ అందించిన సేవలు అందరు గుర్తుపెట్టుకొని అయన మార్గంలో అందరు నడవాలన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే  ఆశయాలను, ఆలోచనలను అమలుపరిచిన వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన సమయంలో మేనిఫెస్టోలోని అన్ని పధకాలను అమలు చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారని అన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలను, విద్యార్థులను, యువతను అన్ని రంగాల వారిని సూపర్ సిక్స్ హామీలు పేరుతొ మోసం చేసిందని విద్యార్థులకు 15 వేలు ఇస్తామని, మహిళలకు చేయూతగా 18 వేలని, నిరుద్యోగ భృతి కింద 3 వేలు ఇస్తామని ప్రతిఒక్కరిని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్న ఇప్పటి వరకు ఏ ఒక్క పధకాన్ని అమలు చేయలేదని కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం ప్రతి సంవత్సరం మే నెలలో అమలు పరిచి  కుటుంబంలో ఒక విద్యార్థికి అమ్మఒడి ఇచ్చామని కానీ ఎన్నికల సమయంలో కూటమి పార్టీ తాము గెలిస్తే కుటుంబంలో ప్రతి ఒక్కరికి అమ్మవొడి పధకం ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు అమ్మఒడి పధకాన్ని అమలు చేయలేదన్నారు అదేవిధంగా రైతు భరోసా పధకం కింద జగన్ మోహన్ రెడ్డి గారు పదమూడున్నర వేల రూపాయలు రైతులకు ఇచ్చేవాళ్ళని కానీ కూటమి పార్టీ లు 20 వేలు ఇస్తామని రైతులను మోసం చేసారని కనీసం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పదమూడున్నర వేలు కూడా ఇవ్వలేదన్నారు ఏ ఒక్క సంక్షేమ పధకాలు అమలు చేయకుండా మాటలకే కూటమి ప్రభుత్వం అంకితమైందన్నారు. కేవలం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అణగదొక్కడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రశ్నిస్తే వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అణగదొక్కాలని, భయబ్రాంతులకు గురి చేయాలనీ ఎప్పుడో పాత కేసులను బయటకు తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్లు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఎంతో దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చాల బాధాకరమని అన్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మంచి చేయాలి గత ప్రభుత్వం కంటే ప్రజలకు మేలు చేయాలని ప్రయత్నం చేయాలనీ అన్నారు కానీ నేడు కూటమి ప్రభుత్వం మేలు చేయకపోగా ప్రశ్నించిన ప్రతి ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వానికి ఆనవాయితీగా జరుగుతుందన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ స్థాపించానన్నారు ఎప్పుడు అయన ప్రశ్నించడమేనా డిప్యూటీ సియం గా ఉండి ఇతరుల ప్రశ్నలకు సమాధానం చెప్పర అన్ని విమర్శించారు. ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఢిల్లీలో కూర్చొని ఈ ఆరు నెలలో రాష్టానికి ఏమి చేసారో చెప్పాలన్నారు. ప్రతి రోజు చిన్న పిల్లల మీద అత్యాచారాలు అఘాయాత్యాలు జరుగుతున్నాయన్నారు, సుమారు వందకు పైబడి మహిళల పైన వయసుతో సంబంధంలేకుండా అత్యాచారాలు, అఘాయాత్యాలు, చంపేయడం వంటివి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగాయన్నారు. ఈ రాష్ట్రానికి హోమ్ మంత్రిగా మహిళా ఉన్నారని కానీ మహిళా హోమ్ మంత్రి  కూడా ప్రెస్ మీట్ లకే పరిమితమయ్యారన్నారు. కేవలం ప్రతిపక్షాలను తిట్టడంలోనే నిమగ్నమయ్యారన్నారు. ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఏమి చర్యలు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి ఇంటికి వచ్చే దాక భయపడాల్సిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతుందన్నారు. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆడార్ ని సరైన పద్దతిలో అమలు చేయాలనీ కేవలం వైయస్ ఆర్ సిపి శ్రేణులను అరెస్ట్ చేయడానికే పోలీసులు పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించిపోయాయన్నారు. భారత దేశంలోనే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలో ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు

ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి  కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి  యరడ్ల ఆంజనేయరెడ్డి  Md ఇర్ఫాన్  పడిగపాటి చైతన్య రెడ్డి  శిరంశెట్టి పూర్ణ  నాయకులు షేక్ హయత్  బంక విజయ  కర్నాటి రాంబాబు  భట్టిపాటి శివ గోలగాని శ్రీనివాసరావు  మజ్జి శ్రీనివాసరావు కొరగంజి భాను  బత్తుల పాండు  బుధాల శ్రీను  ఉండేల శ్రీనివాస రెడ్డి  సరగడ్డ శంకర్ రెడ్డి  హబీబుల్లా  మద్దెల రామ కృష్ణ  యశోధర  మస్తాన్  కేసరి రాజశేఖర్ రెడ్డి కరీం , కేసరి సుబ్బారెడ్డి చిన్నోడు, పెద్ది సాయి , శంకబత్తుల అశోక్ , టి గురుమూర్తి రెడ్డి  విశ్వనాధ రవి  కర్రీ గౌరీ , గురునాయుడు , కామల్ల జోజి , దుద్దుకూరి శివ  తాడిశెట్టి చిన్న బాబు  బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here