Home Political news గవర్నర్ పేట జిల్లా అదనపు కోర్టు ప్రాంగణం

గవర్నర్ పేట జిల్లా అదనపు కోర్టు ప్రాంగణం

2
0

 28-11-2024

 గవర్నర్ పేట జిల్లా అదనపు కోర్టు ప్రాంగణం

*కుల, వర్ణ బేధాలను రూపుమాపుతూ. మహిళల అభ్యున్నతికి పాటుపడిన సంఘసంస్కర్త శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే వర్ధంతి సందర్బంగా ఘన‌ నివాళులు*

ధి:28-11-2024 గురువారం మధ్యాహ్నం 12:30″గం లకు” CVR మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఉన్నటువంటి అదనపు జిల్లా కోర్ట్ ల ఆవరణలో గల బెజవాడ బార్ అసోసియేషన్ హాల్ నందు బార అసోసియేషన్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు నిర్వహించుకోవడమైనది…

 ఈ సందర్భంగా బొండా ఉమా  మాట్లాడుతూ:-1827 ఏప్రిల్ 11న పూణేలో జన్మించిన మన దేశ సామాజిక సంస్కర్త, విద్యావేత్త, సమాజ సేవకుడు, సమాజంలో కులవివక్ష, అసమానతలు రూపుమాపడానికి అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, మహిళా విద్యను ప్రోత్సాహించిన మార్గదర్శి,  బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పరితపించిన మహాత్మ జ్యోతి రావు పూలే అని…

అప్పటి కాలంలో అణచివేతకు గురైన దళిత, మహిళా సమాజాల కోసం గళం ఎత్తి, వారికి విద్య, సమాజంలో సమాన హోదా లాంటి అనేక హక్కుల కోసం పోరాడారు, ఆడపిల్లలకు విద్య అందించడానికి అనేక పాఠశాలలు స్థాపించారు, కుల వ్యవస్థను వ్యతిరేకించి, సమాజంలో సమానత్వం కోసం పోరాడారు, సమాజంలోని మూఢనమ్మకాలను తొలగించి, సామాజిక చైతన్యం తీసుకువచ్చారు అని…

మహాత్మా జ్యోతిరావు ఫూలే  ఆలోచనలు మరియు కృషి ఇప్పటికీ ప్రస్తుత సమాజానికి ప్రేరణగా నిలుస్తున్నాయి. ఆయన ఆదర్శాలను అనుసరించి, సమాజంలో సమానత్వం, న్యాయం కోసం పోరాడాలి అని బొండా ఉమ  కోరారు…

 ఈ కార్యక్రమంలో:-బార్ అసోసియేషన్ నాయకులు చెరుకూరి శ్రీపతి, చలసాని అజయ్ కుమార్, గురునాథం, టిడిపి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు,  న్యాయవాదులు కొండలరావు, పరశురాం సింగ్, ముష్టి శ్రీకాంత్, N. తేజ, అలా తారక రామారావు,దాసరి ఉదయశ్రీ,తదితరులు పాల్గొన్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here