మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన పోతిన వెంకట మహేష్.
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సామాజిక ఉద్యమకారులని వారు అట్టడుగు వర్గాలకు బహుజనులకు విద్య యొక్క ప్రాధాన్య తెలియజేసి ప్రతి ఒక్కరూ చదువుకునేలా కృషి చేశారని పూలే సామాజిక ఉద్యమ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని సాహూ మహారాజ్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆ సామాజిక ఉద్యమ పోరాటాన్ని కొనసాగించారన్నారు.
కూటమి ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది.
కుల గణన చేపట్టాలి.
పులలకు సింహాలకు చెట్లకు పుట్లకు లెక్కలు ఉన్నాయి బీసీల జనాభా లెక్కలు ఎందుకు తీయరు.
పక్కన ఉన్న తెలంగాణలో కుల గణన చేస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కుల గణన ఎందుకు చేయడం లేదు.
చంద్రబాబు బీసీల ద్రోహిగా మారిపోతున్నారనిపిస్తుంది.
జనాభాలో సగం టిడిపితో మనం అని ఎన్నికల ముందు వరకు బీసీల కోసం నినాదాలు ఇచ్చిన మీరు ఎన్నికల ఫలితాల తర్వాత బీసీలపై ప్రేమ ఎందుకు తగ్గిపోతుందో చంద్రబాబునాయుడు సమాధానం చెప్పాలి.
బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను పునరుద్దించాలంటే కచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కుల గణన చేసి తీరాలి.
గతంలో బీసీ ఉపకులాలకున్న 14 కార్పొరేషన్లకు జగన్మోహన్ రెడ్డి 56 కార్పొరేషన్లు గా పెంచారు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం 56 కార్పొరేషన్లు గాను కేవలం 15 కార్పొరేషన్లకే చైర్మన్ లను సభ్యులను నియమకం చేసి 40 బీసీ ఉపకులాల కార్పొరేషన్లను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కన్నా మిన్నగా బీసీలకు మేలు చేయాలంటే 139 బీసీ కులాలకు 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి.
ఉపముఖ్యమంత్రి పదవుల్లో చంద్రబాబు నాయుడు బిసి ఎస్సి ఎస్టి ముస్లిం వర్గాలకు మోసం చేశారు సామాజిక న్యాయం చేస్తామని పదేపదే మాట్లాడి ఈ వర్గాలకు ఉపముఖ్యమంత్రి పదవులు ఇవ్వకుండా సామాజిక మోసం చేశారు.
ఆదరణ ,విదేశీ విద్య ,బిసి కార్పొరేషన్ల ఏర్పాటు వంటి పథకాలపై ఎంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
జగన్మోహన్ రెడ్డి బీసీలను రాజ్యసభ సభ్యులను చేశారు వారిలో ముగ్గురు బీసీలు నేడు రాజీనామా చేశారు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసిన బీసీల స్థానంలో తిరిగి బీసీలనే నియమకం చేయాలి.
డిసెంబర్ నెలలో కుల గణన కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం.
ఈ కార్యక్రమంలో వెన్న శివశంకర్ గంగాధర్ పొట్నూరి శ్రీను నూనె సోమశేఖర్ తవ్వ మారుతి ఎం హనుమాన్ , నేమల సంజీవరావు, సబినకర్ నరేష్, బందెచోడ్ శ్రీనివాస్ పిళ్ళా రవి షాహినా, రాము గుప్త, తమ్మిన రఘు, జెల్లీ రమేష్, సుకశి భాను,బేతాళ రవికుమార్,మారుపిళ్ళ చిన్నారావు, బండారు నూకరాజు, షేక్ బాషా, సోమి మహేష్, రవీంద్ర, ఏసు, గోపి , తేజ, సంజీవరెడ్డి, మనీ, పైలా రోహిత్, చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు