Home Political news జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్హులైన వారందరికీ అక్రిడేషన్లు హెల్త్ కార్డులు వంటి

జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్హులైన వారందరికీ అక్రిడేషన్లు హెల్త్ కార్డులు వంటి

3
0

 జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్హులైన వారందరికీ అక్రిడేషన్లు హెల్త్ కార్డులు వంటి

సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మాత్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు తెలిపారు.శుక్రవారం సెక్రటేరియట్ లో జర్నలిస్టు సంఘాలు సంఘాల నాయకులతో జరిగిన విస్తృత సమావేశాలలో జర్నలిస్టు సంక్షేమానికి సంబంధించి విస్తృతంగా చర్చించారు. త్వరలో అక్రిడేషన్ పాలసీ రూపొందించి అర్హులైన వారికి అక్రిడేషన్ తో సహా ఇతర సంక్షేమ పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇల్లు కట్టించి ఇచ్చే విషయంలో ఆలోచన చేస్తామని పి ఎం ఏ వై 2.0 లో అర్హులైన వారికి ఇల్లు కట్టించి ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి విన్నవించి ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. హెల్త్ కార్డులు అందించడం జర్నలిస్టులపై దాడులను నిరోధించడం ఇతర సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతామని అన్నారు. పత్రికలు ప్రసార సాధనాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడం ద్వారా సహకరించాలని కోరారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నిర్వహించడంలో దానిపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా సూచించారు. ఆరోగ్యకరమైన పరిస్థితులు సమాజంలో నెలకొల్పాలని మీడియా ప్రతినిధులను ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here