Home Political news టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కు ఎల్లువెత్తిన ఫిర్యాదులు

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కు ఎల్లువెత్తిన ఫిర్యాదులు

5
0

 *30.11.2024*

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కు ఎల్లువెత్తిన ఫిర్యాదులు

*• అర్జీలు స్వీకరించిన దేవాదాయశాఖ మంత్రి అనంరామనారాయణరెడ్డి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు*

*• భూ సమస్యలతో పాటు, పలు మోసాలపై నేతలకు బాధితులు ఫిర్యాదు*

శనివారం టీటీడీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు రాష్ట్ర నలుమూలాల నుంచి పోటెత్తిన ఫిర్యాదులు. బాధితుల నుండి దేవాదాయశాఖ మంత్రి అనంరామనారాయణరెడ్డి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ సుజయ్ కృష్ణరంగారావు అర్జీలు స్వీకరించారు. పల్నాడు జిల్లా, ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామానికి చెందిన పాపగంటి డానియల్ బాబు విజ్ఞప్తి చేస్తూ.. తన కాష్టార్జితంతో కొనుగోలు చేసిన 5 సెంట్ల భూమిని దరువూరి శ్రీనివాసరావు అనే వ్యక్తి భూకబ్జా చేసి తనపై దాడికి ప్రయత్నిస్తున్నారని వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.

• అన్నమయ్య జిల్లా, వీరబల్లి మండలం, సానిపాయి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తూ..పంచాయతీలో ఏటువంటి పనులు చేయకుండా తప్పుడు రికార్డులు సృష్టించి గ్రామపంచాయతీలోని ఆర్ధిక సంఘం నిధులు మరియు సాధారణ నిధులను గ్రామ సర్పంచ్ కొంత మంది అధికారులతో కలిసి రూ.70లక్షల ప్రజాధనాన్ని దారి మళ్లించారు. వారి అవినీతిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

• అన్నమయ్య జిల్లా, వీరబల్లి మండలం, సానిపాయి గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తూ..2019లో దేవాలయం కొరకు (శివాలయం) కేటాయించిన సర్వే నెంబర్లు 669/1 మరియు 699/2 లో ప్రభుత్వం భూమి(గయాల)ని కేటాయించింది. వైసీపీ సర్పంచ్ నేతి ఆంజనేయులు అధికారులతో కుమ్మక్కై ఆ భూమిని 1978లో పట్టా పొందినట్లు దొంగ పట్టా సృష్టించి భూమిని కబ్జా చేశారు..విచారణ చేసి తిరిగి ఆ భూమిని దేవాలయం కట్టుకొనుటకు అనుమతి ఇవ్వాలని విన్నవించుకున్నారు. 

• బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంనకు చెందిన రామచంద్రరావు విజ్ఞప్తి చేస్తూ.. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని వైసీపీ ప్రభుత్వంలో నాకు వస్తున్న వృద్ధాప్య పింఛన్ ను అక్రమంగా ఆపివేశారు.. దయచేసి నా వృద్ధాప్య పింఛన్ ను తిరిగి పునరుద్ధరించాలని ఆయన గ్రీవెన్స్ లో కోరారు.

• డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం, మామిడికుదురు మండలం, ఆదురు గ్రామానికి చెందిన కొల్లు నరసింహారావు వినతి పత్రం ఇస్తూ..గత ఐదేళ్లు వైసీపీ నాయకులు నాపై ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటి కేసులు పెట్టి వేధించారు. వైసీపీ నాయకులపై ఇచ్చిన కంప్లైట్ ను కనీసం FIR కూడా నమోదు చేయలేదు..చంద్రబాబు గారిని అరెస్టు చేసిన సమయంలో నాపై బైండ్ ఓవర్ బుక్ ఓపెన్ చేసి SI పలుమార్లు మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు. దీనిపై విచారణ జరిపి ఇలాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశాడు.

• ఎన్.టి.ఆర్ జిల్లా, జి.కొండూరు మండలం, చెపుటూరు గ్రామం గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తూ.. మా గ్రామంలో గాదె నాగబాబు (ఎఫ్.ఎ) ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ.3కోట్లు అక్రమాలకు పాల్పడ్డారు..అతని పై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకొవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

• బాపట్ల జిల్లా, చినగంజం మండలం, చినగంజం గ్రామానికి చెందిన సయ్యద్ కరిష్మా విజ్ఞప్తి చేస్తూ.. మునీస్ షరీఫ్ ఏఆర్ కానిస్టేబుల్ అనే వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నానని..పేళ్లి చేసుకుంటానని నమ్మించి 2018లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు..గత ఐదేళ్లు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రస్తుతం రూ.50 లక్షలు కట్నం ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. దయచేసి నాకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు.

• పల్నాడు జిల్లా, మండాది గ్రామానికి చెందిన దాసరి అజయ్ కుమార్ విజ్ఞప్తి చేస్తూ.. గత వైసీపీ ప్రభుత్వంలో నాపై వైసీపీ నాయకులు దాడి చేసి నాపై కేసులు పెట్టి వేధించారు. గురజాల సబ్ జైల్ లో 20రోజులు పాటు నన్ను వేధించారు.. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత గుజ్జల పాపిరెడ్డి అనే వ్యక్తి వైసీపీ నేతలతో చేతులు కలిపి కులం పేరుతో దుషించారు..వారిపై తగిన చర్యలు తీసుకొవాలని వేడుకున్నారు.

• ఏలూరు జిల్లా, భీమడోలు మండలం, కురెళ్లగూడెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తూ..ఎస్సీ కాలనీ చెందిన శ్మాశాన వాటికను పాలకుర్తి చిన్న అనే వ్యక్తి ఆక్రమించారు.. దాని వల్ల శ్మాశాన వాటిక సరిపోక ఒకరి శవం మీద మరొకరి శవం పాతి పెట్టాల్సిన పరిస్ధితి ఏర్పాడింది..ప్రశ్నించి వారిపై ఎదురుదాడి చేసి బెదిరిస్తున్నాడు..దయచేసి సమగ్ర విచారణ ఎస్సీ కాలనీకి శ్మాశాన వాటికను కేటాయించాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here