ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు, కేంద్ర మాజీమంత్రి, అయిదు రాష్ట్రాల గవర్నరుగా సేవలు చేసిన డా” మర్రి చెన్నారెడ్డి 28వ వర్ధంతిని పురస్కరించుకుని
బిజెపి సీనియర్ నాయకులు పోతిన వెంకటేశ్వరరావు హైదరాబాద్ ఇందిరా పార్కులో ఉన్నటువంటి ఆయన సమాధికి ఆయన కుమారుడు, జాతీయ విపత్తుల నివారణ సంస్థ మాజీ ఉపాధ్యక్షులు, బిజెపి జాతీయ నాయకులు డా” మర్రి శశిధర్ రెడ్డితో కలిసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ముఖ్యమంత్రివర్యులు నాదేండ్ల భాస్కరరావు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, బిసి కమిషన్ చైర్మన్ జి నిరంజన్, మాజీమంత్రులు జెసి దివాకరరెడ్డి, డికె సమరసింహా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఎంవి మైసూరారెడ్డి తదితరులు పాల్గొని చెన్నారెడ్డి సేవలను కొనియాడారు.