Home Andhra Pradesh మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామాఆ కార్యక్రమంలో ఫోజులిస్తున్న చంద్రబాబు వైయస్‌ జగన్‌ ఫైర్‌

మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామాఆ కార్యక్రమంలో ఫోజులిస్తున్న చంద్రబాబు వైయస్‌ జగన్‌ ఫైర్‌

5
0

28.05.2025.
తాడేపల్లి.

మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా
ఆ కార్యక్రమంలో ఫోజులిస్తున్న చంద్రబాబు
వైయస్‌ జగన్‌ ఫైర్‌

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో శ్రీ వైయస్‌ జగన్‌ సమావేశం.
సమావేశంలో పాల్గొన్న ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలు, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్స్, వైస్‌ ఛైర్‌పర్సన్స్, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు. ఇంక ఆయా జిల్లాల పార్టీ ముఖ్యనాయకులు.

కడపలో మహానాడు నిర్వహణ హీరోయిజం కాదు
అలాగే జగన్‌ను తిట్టడం హీరోయిజం కాదు
హీరోయిజం అంటే హామీలు అమలు చేయడం
కానీ ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదు
:శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టీకరణ

రాష్ట్రంలో కలియుగ రాజకీయాలు
ఇది చంద్రబాబు దౌర్భాగ్య పాలనకు నిదర్శనం
రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ముఖ్యం
కానీ అవేవీ లేకుండా చంద్రబాబు రాజకీయం
రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు
:శ్రీ వైయస్‌ జగన్‌ ధ్వజం

కోవిడ్‌ కష్టకాలంలోనూ ప్రజలకు మేలు చేశాం
ఆదాయాలు తగ్గినా ప్రజలు ముఖ్యమనుకున్నాం
మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశాం
అందుకే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం
:గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్‌

తాడిపత్రి మున్సిపాలిటీలో మనకు మెజార్టీ లేదు
అక్కడ ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాం
ఛైర్మన్‌ పదవి కోసం అడ్డదార్లు తొక్కలేదు
కానీ ఇప్పుడు చంద్రబాబు దారుణ వ్యవహారం
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
కుప్పంలో అరాచకాలకు పాల్పడ్డారు
రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయమంటున్నాడు
మన పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు విలువలుతో నిలబడ్డారు
చూసి నేర్చుకొమ్మని బాబుకు గుణపాఠం చెప్పారు
మీ అందరి నిబద్ధతకు నా హ్యాట్సాఫ్‌
:పార్టీ స్థానిక సంస్థల ప్రతిని«ధులకు వైయస్‌ జగన్‌ ప్రశంస

మనం చేసిన మంచి ప్రజల్లో ఉంది
రాత్రి తర్వాత ఎప్పటికైనా పగలు ఖాయం
మన పాలనలో ప్రతి ఇంటికీ మంచి చేశాం
ప్రతి గడపకూ గర్వంగా మన కార్యకర్తలు వెళ్లగలరు
అలా చంద్రబాబు తన కార్యకర్తలకు చెప్పగలడా?
:సూటిగా ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్‌

వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి
విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు తిరోగమనం
ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తున్నారు
ఆరోగ్యశ్రీ లేక పేదలు అప్పుల పాలవుతున్నారు
రైతులకు ఏ పంటకూ మద్ధతు ధర రావడం లేదు
రైతుల బతుకు దళారీల పాలవుతోంది
లా ఆండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది
రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది
తప్పుడు కేసులు పెడుతున్నారు
తప్పుడు సాక్ష్యాలు కూడా సృష్టిస్తున్నారు
:శ్రీ వైయస్‌ జగన్‌ ఆక్షేపణ

జగన్‌ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం
మీ ప్రతి కష్టం అన్యాయం గమనిస్తున్నాను
మీకు అన్యాయం చేసిన వారి పేరు రాసుకొండి
వారెవ్వరినీ వదిలి పెట్టం. ఎక్కడున్నా తీసుకొస్తాం
రిటైర్డ్‌ అయినా కచ్చితంగా చట్టం ముందు పెడదాం
వడ్డీతో సహా రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇస్తాం
ఇలాంటి తప్పులు చేయడానికి భయపడాలి
యూనిఫాం ఉంది అన్యాయం చేయడానికి కాదు
:సమావేశంలో తేల్చి చెప్పిన వైయస్‌ జగన్‌

తాడేపల్లి:
మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని, ఆ కార్యక్రమంలో చంద్రబాబు ఫోజులిస్తూ బిల్డప్‌ ఇస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కడపలో మహానాడు నిర్వహణ హీరోయిజమ్‌ కాదన్న ఆయన, జగన్‌ను తిట్టడం హీరోయిజం కాదని.. అసలు హీరోయిజం అంటే హామీలు అమలు చేయడమని వెల్లడించారు. కానీ ఇచ్చిన ఏ హామీని చంద్రబాబు నెరవేర్చలేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో సమావేశంలో గుర్తు చేశారు.
సమావేశంలో శ్రీ వైయస్‌ జగన్, ఇంకా ఏం మాట్లాడారంటే..:

ఆ ధైర్యం మనందరికీ ఉంది:
ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక రాత్రి వచ్చిన తర్వాత పగలు రాక తప్పదు. మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదు. ప్రతి ఇంట్లో మనం చేసిన మంచి బ్రతికే ఉంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. రెండు ప్రభుత్వాల మధ్య తేడాను ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ్టికీ గర్వంగా చెబుతున్నాను. వైయస్సార్‌సీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా, ఏ నాయకుడు అయినా రాష్ట్రంలో ఏ ఇంటిౖMðనా వెళ్లి గర్వంగా తలెత్తుకుని చిక్కటి చిరునవ్వుతో ఫలానా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వాళ్లం అని చెప్పే ధైర్యం ఉంది.

ప్రజలకు అన్నీ గుర్తున్నాయి:
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేశామని మహానాడు వేదిక నుంచి చెప్పే ధైర్యం మీకుందా?. అలాగే రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పని చేశామని టీడీపీకి చెందిన ఏ కార్యకర్త అయినా ధైర్యంగా చెప్పుకోగలరా?.
టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా ఆ ప్రతి ఇంట్లో వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి వీళ్లు చెప్పిన మాటలు ప్రజలకు ఇవాల్టికీ గుర్తు ఉన్నాయి. అందుకే వాళ్లు ఏ ఇంటికైనా వెళ్లి ఆశీర్వదించమని కోరితే.. ప్రతి ఇంటిలోనూ చిన్నపిల్లల నుంచి ప్రశ్నించడం మొదలవుతుంది. నా రూ.15 వేలు ఏమయ్యాయని అడుగుతారు. అదే ఇంట్లో నుంచి వాళ్ల అమ్మ, చిన్నమ్మ వచ్చి నాకు ఇస్తామన్న రూ.18 వేలు ఏమయ్యాని ప్రశ్నిస్తారు. అంతటితో ఆగకుండా ఆ తల్లుల అమ్మలు, అత్తగారు వచ్చి 50 ఏళ్లకు పెన్షన్‌ అన్నావ్‌. మా రూ.48 వేల సంగతేంటని నిలదీస్తారు. కండువా కప్పుకున్న ప్రతి రైతూ ఎన్నికలప్పుడు నీకు రూ.26 వేలు అన్నావు. వాటి సంగతేంటని అడుగుతాడు. అదే ఇంట్లో నుంచి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న 20 ఏళ్ల యువకుడు నాకు ఇస్తానన్న రూ.36 వేలు పరిస్థితి ఏంటని నిలదీస్తాడు.

మహానాడు కార్యక్రమం ఒక డ్రామా:
మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా. ఆ కార్యక్రమంలో చంద్రబాబు ఫోజులు ఇస్తున్నాడు. మహానాడు పేరుతో తెలుగు డ్రామా పార్టీ కడప జిల్లాలో కార్యక్రమం చేస్తోంది. హీరోయిజం అంటే కడప జిల్లాలో మహానాడు పెట్టడం కాదు. హీరోయిజం అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చడం. అంతే తప్ప సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు. కడపలో మహానాడు పెట్టి.. జగన్‌ను తిట్టడం హీరోయిజం ఎలా అవుతుంది? చంద్రబాబూ గుర్తు పెట్టుకో. మీ కార్యకర్తను ఇంటింటికీ తిప్పే సత్తా ఉందా? అని ప్రశ్నిస్తున్నాను. ఇది వైయస్సార్సీపీ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి తేడా.
చంద్రబాబు ప్రభుత్వం, ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవెన్‌ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. కడపలో మహిళలు చంద్రబాబు ఎప్పుడు ఉచిత బస్సు అని చెబుతాడా.. విశాఖపట్నం వెళ్లి వద్దామా అని ఎదురు చూస్తున్నారు. మరో చిన్న హామీ ఉచిత గ్యాస్‌. ఆ గ్యాస్‌ సిలిండర్లు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు.

దౌర్భాగ్య పాలనకు నిదర్శనం:
ఈరోజు రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, కలియగ రాజకీయాలు ఎలా ఉన్నాయో సాకు‡్ష్యలుగా ఉన్న మీరే నా కన్నా బాగా చెబుతారు. రాజకీయాల్లో విలువలుండాలి. విశ్వసనీయతకు అర్ధం తెలుసుండాలి. అప్పుడే రాజకీయ వ్యవస్ధలో మనం తులసి మొక్కలా నిలబడతాం. మొట్టమొదటిసారిగా చంద్రబాబు తన పాలనలో రాజకీయాలు భ్రష్టు పట్టిస్తున్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు సహా అనేక పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను చంద్రబాబు తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి లేకపోయినా.. వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులు వీళ్లు అని తెలిసినా.. తాను ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిసినా కూడా తానే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. ఇది ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న దౌర్భాగ్య పాలనకు నిదర్శనం.

ఏనాడూ మేలు మరువలేదు:
మన ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. మనం జూన్‌ లో ప్రమాణ స్వీకారం చేస్తే.. కొద్ది నెలలకే మార్చికల్లా కోవిడ్‌ ను చూశాం. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదు. కోవిడ్‌ లాంటి మహమ్మూరి వస్తే రాష్ట్రం ఎలా ఉంటుందన్నది ఎవరి ఊహకూ అందలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. మరోవైపు అనుకోని ఖర్చులు పెరిగాయి. అన్ని రకాలుగా రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులున్నా, ఏ రోజూ ప్రభుత్వానికున్న ఇబ్బందులను సాకుగా చూపి ప్రజలకు చేయాల్సిన మేలు జరక్కుండా పక్కన పెట్టిన పరిస్థితి లేదు. మనకు ఎన్ని సమస్యలున్నా చిక్కటి చిరునవ్వునే చూపించాం. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదు. ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. ఇచ్చిన ప్రతి హామీని సీఎంఓ మొదలు ప్రతి కార్యాలయంలోనూ డిస్‌ ప్లే చేశాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ దాన్ని అమలు చేసేట్టుగా చేశాం. అలా మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99శాతం హామీలను అమలు చేసిన పాలన వైయస్సార్పీపీ హయాంలోనే జరిగింది.

పాలన ఎలా ఉండాలో చూపాం:
అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్‌ స్వీప్‌ చేశాం. దాదాపు 86 నుంచి 88 శాతం స్ధానాలను మనమే గెలిచాం. దాదాపు 120 చోట్ల క్లీన్‌ స్వీప్‌ చేయగా, తాడిపత్రి, దర్శి రెండు చోట్ల మాత్రమే మనకు తక్కువ వచ్చాయి. తాడిపత్రిలో వాళ్లకు 18 మనకు 16 వస్తే.. మన ఎమ్మెల్యే వాళ్లను లాగుదామన్నాడు. నేను స్వయంగా మన ఎమ్మెల్యేను హౌస్‌ అరెస్టు చేయించి అక్కడ ఎన్నిక సవ్యంగా జరిపించాను. వైయస్సార్సీపీ హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి, ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్ధానంలో వ్యక్తి పాలన ఎలా చేయాలో చూపించాం.

మీ అందరికీ నా హ్యాట్సాఫ్‌:
ఇవాళ ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా ఇదే చేయమని తన ప్రతి ఎమ్మెల్యేను ప్రోత్సహిస్తున్నాడు. ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్ధలో విలువులు తావిచ్చి, విశ్వసనీయత అనే పదానికి అర్థం చెబుతూ, మన పార్టీల్లో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారైనా.. ఏకంగా ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తికి కూడా గుణపాఠం చెప్పారు. రాజకీయాలు నీ మాదిరిగా కాదు చేయాల్సింది మమ్నల్ని చూసి నేర్చుకో అని చంద్రబాబుకు గుణపాఠం చెప్పారు. అందుకు మీ అందరికీ నా హ్యాట్సాఫ్‌.

వ్యవస్థలన్నీ నిర్వీర్యం:
మరోవైపు వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. ఇంగ్లిషు మీడియం పడకేసింది. మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫెల్‌ చెప్పిస్తూ.. దాన్ని ఒక పీరియడ్‌గా ఏర్పాటు చేస్తే వీళ్లు వస్తూనే దాన్ని ఎత్తేశారు. సీబీఎస్‌ఈ, నాడు–నేడు, పిల్లలకు ట్యాబులు అన్నీ ఆగిపోయాయి. అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన లేదు. ఏడాది కావస్తోంది. పిల్లలకు కట్టాల్సిన ఫీజులు సున్నా. మన హయాంలో ప్రతి మూడు నెలలకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే వాళ్లం. ఇవాళ ఫీజులు గురించి పట్టించుకునే నాధుడు లేడు. పిల్లలను చదవించలేక తల్లిదండ్రులు చదువులు మానిపించేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఆరోగ్య శ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు. మన హయాంలో 1000 ప్రొసీజర్లను 3000కు తీసుకుని పోయి రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించి, గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేసి, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెఫ్ట్‌ అందుబాటులోకి తీసుకొచ్చాం. గవర్నమెంటు ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ అందుబాటులోకి తెచ్చాం. అలాంటి పాలన మనం అందిస్తే, ఇవాళ పేషెంట్లకు ఆరోగ్య శ్రీ అందని పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.300 కోట్లు చొప్పున ఏడాది బకాయిలు పెట్టారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూడ్డం ఆపేశారు. ఇవాళ పేదలు వైద్యంకోసం అప్పులు పాలు అవుతున్నారు.
మరోవైపు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్బీకేలు, ఇ–క్రాపింగ్, ఉచిత పంటల బీమా గాలికి వదిలేశారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద సీజన్‌ అయ్యేలోగా రైతులకు తోడుగా సాయం చేసే కార్యక్రమం నిలిచిపోయింది. ఏడాది కాలంగా రైతు భరోసా లేదు. రైతులకు ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు రావడం లేదు. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) మాత్రమే కాదు.. జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.10 వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో, పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా ఇవాళ రైతులకు ధరలు రావడం లేదు. రైతుల బతుకు దళారీల పాలవుతోంది.

రెడ్‌బుక్‌ రాజ్యాంగం:
రాష్ట్రంలో లా ఆండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలవుతోంది. నా కన్నా మీరే చెప్పగలుగుతారు. ఇవాళ చంద్రబాబు పాలనా వైఫల్యాలను, అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు.. ఆ గొంతు వినపడకుండా ఉండడం కోసం భయాన్ని సృష్టిస్తూ రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు.
పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవరిదో తెలుసు. చంపిన వాళ్లు ఎవరో కూడా తెలుసు. టీడీపీలో గ్రూపుల తగాదాలే దీనికి కారణమని ఎస్పీ స్వయంగా చెప్పారు. కానీ, రెండు రోజుల తర్వాత మన పార్టీ ఇన్‌ఛార్జ్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి మీద కేసులు పెట్టారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్టు చేశారు. అందు కోసం ఏ మాత్రం బేస్‌లేని పాత కేసు బయటకు తీశారు. గతంలో ఇల్లీగల్‌ మైనింగ్‌ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే, అదే అధికారులతో తప్పుడు ఫిర్యాదు చేయించి, తప్పుడు సెక్షన్లతో కేసు పెట్టి అరెస్టు చేశారు.
2023లో టీడీపీ కార్యాలయంపై ఘటన విషయంలో ఇప్పుడు 127 ముద్దాయి కింద మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే మీద కేసు పెట్టారు. ఈ మధ్యకాలంలో అనేక దారుణాలు కూడా వెలుగు చూస్తున్నాయి. చట్టం, రాజ్యాంగం ఉల్లంఘనకు గురవుతోంది. గతంలో జరిగిన ఘటనల్లో మన వాళ్లను ఇరికించి జైల్లో పెట్టే కార్యక్రమం రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో జరుగుతోంది.

అంతా తిరోగమనం. అస్తవ్యస్తం:
రాష్ట్రంలో ఏ వర్గమూ చంద్రబాబు ప్రభుత్వంపై సంతృప్తిగా లేదు. ఏడాది చంద్రబాబు పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగమూ రాలేదు. ఉన్న ఉద్యోగాలూ పీకేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే 2.6 లక్షల మంది వాలంటీర్లు, 15వేల మంది బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు, 9800 రేషన్‌ వాహనాల (ఎండీయూ) మీద ఆధారపడ్డ 20వేల మంది ఇలా మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలు పీకారు.
మన పాలనలో ఉద్యోగస్తుల్లో చంద్రబాబు విషం నింపి, మోసం చేశాడు. వాళ్లలో ఇప్పుడు ఒక్కరికీ మధ్యంతర భృతి (ఐఆర్‌) ఇచ్చిన పాపాన పోలేదు. వేతనాల సవరణ (పీఆర్‌సీ) ప్రస్తావన లేదు. మూడు డీఏలు పెండింగ్‌. అందుకే ఉద్యోగులు ఇవాళ చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామని తల పట్టుకుంటున్నారు.

విచ్చలవిడిగా అవినీతి:
మరోవైపు విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ఇసుక, మట్టి, లిక్కర్‌ మాఫియా. సిలికా, క్వార్ట్‌›్జఅక్రమ తవ్వకాలు, రాజధాని పనులు.. ఇలా దేన్నీ వదలకుండా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో స్కాంలు చేస్తున్నారు. ఇలాంటి స్కాంలు మన హయాంలో లేవు. అవి లేవు కాబట్టే మన ప్రభుత్వంలో మనం రూ.2.73 లక్షల కోట్లు బటన్‌ నొక్కి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) చేశాం.
మరి ఆరోజు జగన్‌ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు?. నేను ఆశపడింది ఒక్కటే. నా మరణం తర్వాత ప్రతి ఇంట్లో బతికే ఉండాలని ఆశ పడ్డాను. అందుకే ఎక్కడా రాజీ పడలేదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోగలిగాను.
అదే ఇవాళ చంద్రబాబు ఎందుకు బటన్‌ నొక్కడం లేదంటే.. ప్రతి దాంట్లోనూ దోచుకోవడం. దోచుకున్నది పంచుకోవడం. అదే చేస్తున్నాడు. అందుకే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 13 శాతం ఆదాయాలు పెరిగితే.. మనకు కేవలం 3 శాతమే పెరిగాయి. అలా ఎందుకు జరుగుతోందంటే.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం టీడీపీకి చెందిన గజ దొంగల ముఠా జేబుల్లోకి పోతోంది.
ఇంత మంచి చేసిన మనకే ఇలాంటి పరిస్థితి వస్తే.. ఏ మంచి చేయని, అన్నీ అబద్ధా్దలు, మోసాలు చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారికి డిపాజిట్లు రాని పరిస్థితులు ఖాయం.

కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత:
ఈసారి జగన్‌ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నాడు మనం అధికారంలోకి వస్తూనే కోవిడ్‌ వచ్చింది. జూన్‌లో అధికారంలోకి వస్తే మార్చిలో కోవిడ్‌ వచ్చింది. ఆ తర్వాత రెండు సంవత్సరాలు పూర్తిగా ప్రజల ఆరోగ్యం మీద, వారికి మంచి చేసే విషయంపైనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. కానీ ఈసారి జగన్‌ 2.0లో అలా ఉండదు. మనం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు. కార్యకర్తలకూ ప్రాధాన్యత ఉంటుంది. కార్యకర్తలు అన్నింటికన్నా పైస్థాయిలో ఉంటారు. ఆ విధంగా కార్యకర్తల బాగోగులన్నీ చూసుకుంటాం.

వారెక్కడున్నా చట్టం ముందు నిలబెడతాం:
ఇప్పుడు మన పార్టీ కార్యకర్తల ప్రతి కష్టం, వారికి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నాను. మీ అందరికీ ఒక్కటే చెబుతున్నాను. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో వారి పేర్లు రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్‌ గిఫ్ట్‌లు ఇస్తాం. చేసిన వాళ్లే కాదు. వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించిన వారినీ వదిలిపెట్టం. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్డ్‌ అయినా సరే అందరినీ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానికి వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు నిర్వర్తించడానికి వీరికి యూనిఫాం ఇచ్చారు.

అప్పుడే రాష్ట్రం బాగు పడుతుంది:
మన హయాంలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో సమస్యలు చెప్పి, ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వాళ్లే. ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. స్పందనలో అత్యధికంగా ఫిర్యాదులు చేసిందీ వాళ్లే. కాని, ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నాడు. దీనికి వడ్డీతో సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారని, రాష్ట్రం కూడా బాగు పడుతుందని సమావేశంలో వైయస్‌ జగన్‌ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here