06.12.2024
రాజ్యంగ నిర్మాత డా.బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించిన యార్లగడ్డ
రెవిన్యూ సదస్సులను ప్రతి ఓక్కరూ వినియోగించుకోవాలి
గత ప్రభుత్వ తీరు కారణంగా రెవిన్యూ సమస్యలు ఎక్కువయ్యాయి
జనవరి 8 వ తారీఖు వరకు ఈ సదస్సులు జరుగుతాయి
ప్రతి ఓక్కరూ భూ సమస్యల పరిష్కారం కోసం రెవిన్యూ సదస్సులను వినియోగించు కోవాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు , ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు . శుక్రవారం బాపులపాడు మండలంలోని బాపులపాడు గ్రామం , విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామం నందు రెవిన్యూ సదస్సులను ఆయన ప్రారంభించారు . ముందుగా అంబేద్కర్ వర్ధంతి ని పురస్కరించుకుని రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు . అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యంగాన్ని రచించి అంబేద్కర్ దేశానికి మార్గదర్శకులుగా నిలిచారని అన్నారు . 1952వ సంవత్సరంలో న్యాయ శాఖ మంత్రి గా పని చేసిన ఆయన హిందూ యాక్ట్ బిల్లు ను లోక్ సభ లో ప్రవేశ పెట్టగా వీగిపోతే రాజ్యంగం రాసిన ఆయనే రాజీనామ చేసిన పరిస్ధితి ఉందన్నారు . సంప్రదాయాలు సంసృతి ఉన్న ఓకైక దేశం మన భారత దేశం అని అన్నారు . స్త్రీలకు అస్తిలో సమాన హక్కు చట్టాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడ ఆచరించాలని అన్నారు . తన చెల్లి షర్మిలకు రావాల్సిన అస్తిలో వాట ఇవ్వాలని సూచించారు .మంగళగిరి టిడిపి కార్యాలయం నందు ప్రజావేదిక లో తాను పాల్గొంటే అధిక శాతం భూ వివాదాల పైనే ఫిర్యాదులు అందాయని పెర్కొన్నారు . రెవిన్యూ సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు . గత ప్రభుత్వం తీరు కారణంగా రెవిన్యూ సమస్యలు ఎక్కవయ్యాయనీ చెప్పారు . కామన్ సైట్లు అన్యక్రాంతం అయ్యిన పరిస్ధితి ఉందని .. భూములను కాపాడాల్సిన భాధ్యత అధికారులపై ఉందన్నారు . రెవిన్యూ పరిథిలో ప్రతి సమస్యలకు ఈ రెవిన్యూ సదస్సులో పరిష్కారం లభిస్తుందని అన్నారు . ఈ కార్యక్రమంలో కృష్ణ డిపివో జె.అరుణ, బాపుల పాడు మండల తహశీల్దార్ నాగభూషణం, విజయవాడ రూరల్ తహశీల్దార్ సుగుణ , ఎంపిడివో విగ్గిన్స్ , నాయకులు చలమలశెట్టి రమేష్ బాబు , సర్పంచ్ కమలాబాయి, దయాల రాజేశ్వరరావు, దుట్టా శ్రీమన్నారాయణ, పుట్టా సురేష్, ఆళ్ళ వెంకటగోపాలకృష్ణ, వేములపల్లి శ్రీనివాసరావు, గుండపనేని ఉమామహేశ్వరరావు, మూల్పూరి సాయి కళ్యాణి, అట్లూరి శ్రీనివాసరావు, వడ్డీ శివనాగేశ్వరరావు, మేడేపల్లి రమ, వడ్డిల్లి లక్ష్మీ, మండాది రవీంద్ర, వీరమాచినేని సత్యప్రసాద్, పాటి రాజేశ్వరరావు, చిన్నాల లక్ష్మీ నారాయణ, మొవ్వ వేణుగోపాల్, చలసాని శ్రీనివాసరావు, మాదాల శ్రీనివాసరావు, దయాల రాజీవ్ కాంత్, వంపుగాని చిన్ని, లావేటి వెంకటేశ్వరరావు, గండేపూడి నితీష్, బేతాళ ప్రమీళా రాణి, శ్రీనివాసరావు , మంగపతి , శ్రీనివాస రెడ్డి , వర్శ , సోంగ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .