స్క్రోలింగ్ పాయింట్స్ 28-05-2025 మహానాడు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) నిరంతరం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించే మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం ఆరు తీర్మానాలు మహానాడు లో ప్రవేశపెట్టారు*ఈ మహానాడులో ప్రవేశపెట్టిన ఆరు తీర్మానాలు ప్రజల వద్దకు వెళ్లే విధంగా కృషి చేస్తాము..*విశాఖలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరు కాబోయే యోగా డేను 5 లక్షల మందితో నిర్వహించాలని తీర్మానం చేయటం జరిగింది. *కడపలో రేపు జరగబోయే కనీవిని ఎరుగని రీతిలో మహానాడు బహిరంగ సభ జరగబోతుంది*తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి సీఎం చంద్రబాబు నాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నము..*టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ చూడాలనే టిడిపి శ్రేణుల కోరిక ఈ మహానాడులో తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఎంపి కేశినేని శివనాథ్ *నందమూరి తారకరామారావు కూడు, గూడు, నీడ నినాదంతో తెలుగుదేశంపార్టీ స్థాపించారు*ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకువెళుతున్నారు*తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మనో ధైర్యం కల్పిస్తూ, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ పార్టీని విజయపథంలో నడిపిస్తున్నారు.*ప్రాంతీయ పార్టీ అయిన టిడిపికి కోటి మంది సభ్యత్వాలు నమోదు చేయించిన ఘనత టిడిపి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి,మంత్రి నారా లోకేష్ కే దక్కుతుంది. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డ్
