లక్షలాది భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టిన జగన్ – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ
2014-19 సంవత్సరాల మధ్య కేంద్ర సహకారంతో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం సబ్సిడీతో పనిముట్లను మేస్త్రీలకు, ఎలక్ట్రీషియన్లకు, ప్లంబర్ల లాంటి లక్షలాది భవన కార్మికులకు మెరుగైన ఉపాధికోసం ఇచ్చింది. కార్డులున్న సభ్యులు మరణిస్తే వారికి 50 వేల రూపాయలను కూడా ప్రభుత్వం చెల్లించింది. ఇవే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చింది.
కానీ *జగన్ ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాలలో కార్మికుల పొట్ట కొట్టింది. వారి జీవితాల్ని రోడ్డున పడేసింది. వారందరి పాపమే నేడు జగన్ కి శాపమై చుట్టుకున్నది* మంగళగిరి ఎయిమ్స్ విద్యార్థుల మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఎయిమ్స్ పూర్తి కోసం 1618 కోట్లను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ తరపున ధన్యవాదాలు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ వారధి కార్యక్రమంలో తెలిపారు.
*బీజేపీ రాష్ట్ర పార్టీ నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులకు జగన్ తీసేసిన సంక్షేమ పథకాలను తిరిగి అందించాలని ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చనుబండ ఏరియా భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు బుర్రి శ్రీకాంత్ కూటమి ప్రభుత్వానికి వినతిని అందించారు* కార్యక్రమ ప్రతినిధులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సూర్యనారాయణ రాజు, బిజెపి క్లస్టర్ ఇంచార్జ్ శ్రీనివాస రాజు, పాల్గొన్నారు.