Home Political news ఈ నెల 20వ తేదీన ‘నూరేండ్ల నా ఊరు’ పాటకు గాయకుల ఎంపిక కార్య‌క్ర‌మం

ఈ నెల 20వ తేదీన ‘నూరేండ్ల నా ఊరు’ పాటకు గాయకుల ఎంపిక కార్య‌క్ర‌మం

3
0

 *18-12-2024*

ఈ నెల 20వ తేదీన  ‘నూరేండ్ల నా ఊరు’ పాటకు గాయకుల ఎంపిక కార్య‌క్ర‌మం

 

విజ‌య‌వాడ :  పల్లె చరిత్ర, మానవ జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయాలు, మానవీయ విలువలను భావితరాలకు అందించాలని 243 చ‌ర‌ణాల‌తో ర‌చించిన‌ ‘నూరేండ్ల నా ఊరు’  గేయ కావ్యాన్ని పాడించేం దుకు రెండు  తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల నుంచి 243 మంది గాయనీ గాయకు లను ఎంపిక చేయనున్నట్లు కవి, రచయిత, సంగీత దర్శకుడు వరంగల్ శ్రీనివాస్ తెలిపారు. 

బుధ‌వారం విజ‌య‌వాడ గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వ‌రంగ‌ల్ శ్రీనివాస్ మాట్లాడుతూ నూరేండ్ల నా ఊరు గేయ కావ్యాన్ని 243 మం ది గాయనీ గాయకులతో సంయుక్తంగా ఆలాపించేందుకు గాయనీ గాయకుల ఎంపిక ప్రక్రియను ఈ నెల 20వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం వ‌ర‌కు 6గంట‌ల వ‌ర‌కు హ‌నుమాన్ పేట‌లో విజ‌య‌వాడ ప్రెస్ క్ల‌బ్ లో ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు.

 కోస్తాంధ్ర జిల్లాల్లోని ఔత్సాహిక గాయనీగాయ‌కులు త‌ర‌లివ‌చ్చి ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. గాయ‌నీగాయ‌కుల ప్ర‌తిభా పాట‌వాల ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా ఎంపిక చేయ‌టం జ‌రుగుతుంద‌న్నారు.  గాయ‌నీ గాయ‌కుల‌కు భోజన వసతి కూడా ఏర్పాటు చేసిన‌ట్లు తెలియ‌జేయ‌టంతో పాటు, ఇత‌ర వివ‌రాల కోసం 95739 89134, 90008 52227 సంప్ర‌దించాలని కోరారు. 

ఈ కార్య‌క్ర‌మంలో ధ్వ‌ని అనుక‌ర‌ణ చక్ర‌వ‌ర్తి భ‌విరి ర‌వి, అంత‌రాత్జీయ జాన‌ప‌ద క‌ళాకారులు దామోద‌ర గ‌ణ‌ప‌తి రావు, క‌వి,గాయ‌కులు ఎమ్.వి.మ‌ల్లిక్ తేజ్, గాయ‌కులు జోపాక శివ‌, మ‌హేష్ గూడూరు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here