Home Political news ప్రేమ, కరుణ, శాంతికి ప్రతిరూపం క్రిస్ మస్

ప్రేమ, కరుణ, శాంతికి ప్రతిరూపం క్రిస్ మస్

4
0

 ప్రేమ, కరుణ, శాంతికి ప్రతిరూపం క్రిస్ మస్ 

ఘనంగా క్రిస్ మస్ వేడుకలు 

ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు హాజరు

కేక్ కట్ చేసి క్రిస్టియన్లకు క్రిస్ మస్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం

                రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో విజయవాడలోని ఓ పంక్షన్ హాల్ లో సోమవారం వేడుకగా క్రిస్టమస్ సెలబ్రేషన్స్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా  శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ కలసి ఉండటం, సంతోషంగా ఉండటం అంటేనే క్రిస్మస్ కు గుర్తు అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీస్తు మతాన్ని స్వీకరించకపోయినా క్రీస్తు తత్వాన్ని అనుసరిస్తారన్నారు. ప్రేమను పంచి, పగను తుంచాలని క్రీస్తు సూక్తిని పాటించే నేత మన ముఖ్యమంత్రి అని అన్నారు. క్షమాగుణం గల నేత మన ముఖ్యమంత్రి అని కొనియాడారు.

                           విజయవాడ సెమీ క్రిస్మస్ వేడుకల్లో మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎన్ఎమ్ డీ ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆనందంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారన్నారు. సమైక్యాంధ్రలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగేలా ఆదేశాలిచ్చారన్నారు. నా నియోజకవర్గంలో కొన్ని వేల చర్చిలకు అనుమతులు ఇవ్వడంతోపాటు వాటిని నిర్మించానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది పాస్టర్లకు, మౌజమ్స్ కు ఆర్థిక చేయూతనిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం మైనార్టీలకు రూ. 5 కోట్ల ఖర్చు చేస్తే మా ప్రభుత్వ హయాంలో రూ. 70 కోట్ల ఖర్చు చేశామన్నారు. మైనార్టీలు, క్రిస్టియన్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

                                క్రిస్టియన్ల ఆర్థికాభివృద్ధికి స్వయం ఉపాధి రుణాలు అందించిన, అందిస్తున్న ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమేనని బీసీ సంక్షేమ శాఖామాత్యులు ఎస్. సవిత అన్నారు. గత ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెప్పిందని, సీఎం చంద్రబాబు పాలనలో తనదైన మార్క్  చూపిస్తూ ప్రతి ఒక్కరి అభివృద్దికి బాటలు వేస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పర్వదినం క్రిస్ మస్ అని అన్నారు. దైవ కుమారుడి త్యాగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. లోక రక్షకుడైన ఏసు ప్రభువు అందిరిపై తన చల్లని దీవెనలు అందించాలని కోరారు. చంద్రబాబు గతంలో గుంటూరులో రూ. 10 కోట్లు కేటాయించి క్రిస్టియన్ భవన్, చర్చి నిర్మాణానికి అంకురార్పణ చేశారని, కాని గత ప్రభుత్వం ఆ ఊసే మరిచిపోయి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడంతో ఒక్క అడుగు కూడా పడలేదన్నారు. మళ్లీ అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు ఆగిపోయని క్రిస్టియన్ భవన్ కు మరోసారి రూ. 10 కోట్లు కేటాయించారన్నారు. క్రిస్టియన్ యువత ఆర్థిక స్వాలంభన సాధించడానికి ఒక్కోక్కరికి రూ. లక్ష రుణం అందిస్తున్న ప్రభుత్వం మనందరి ప్రభుత్వమని అన్నారు. 

                                        విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ ప్రేమ, దయ, శాంతికి యేసు క్రీస్తు మార్గమని అని, ప్రతి ఒక్కరూ ప్రభువు మార్గంలో నడవాలని సూచించారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ తోనే క్రిస్టియన్ల సంక్షేమం, అభివృద్ధి సాధ్యం అని అన్నారు.. రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి అవిరళ కృషి చేస్తున్నారని కొనయాడారు..

                           ఎమ్మెల్యే గద్దే రామ్మోహనరావు మాట్లాడుతూ మైనార్టీ ల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడే సీఎం చంద్రబాబు వారి అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక అయిన ఆ దైవ కుమారుడి జన్మదినమే క్రిస్ మస్ అని అన్నారు. 2014-19 లో క్రిస్ మస్ కానుక అందించిన ప్రభుత్వం మనందరి ప్రభుత్వమన్నారు. మళ్లీ క్రిస్ మస్ కానుకను పునరుద్ధరించి అందరికి అందించి వారి కళ్లలో కాంతులు చూడాలన్న సీఎం చంద్రబాబు ఆశిస్తున్నారన్నారు. సీఎ చంద్రబాబుతోనే మైనీర్టీల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 

             అనంతరం సీఎం చంద్రబాబు క్రిస్ మస్ కేక్ కట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, రాష్ట్ర ఉన్నతాధికారులు, నాయకులు, మత పెద్దలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here