Home Political news మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

4
0

 విజయవాడ

27-12-2024

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

స్థానిక ఊర్మిళానగర్ లోని 43వ డివిజన్ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ దేశానికి ఆర్థికవేత్తగా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, దాదపు పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా, ఆర్ధిక మంత్రిగా, వివిధ హోదాలలో ఈ దేశానికీ సేవలందించిన మహనీయుడు మన్ మోహన్ సింగ్ మన మధ్యలేకపోవడం చాల బాధాకరం అని, వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు

ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here