*ఈరోజు అపాచ్చీమేడు నుంచి సన్నిధానం వరకు పరిశుభ్రత పనులు చేపట్టారు.*
*శబరిమలలో మండల కాలం అనంతరం శబరిమల శ్రీ ధర్మశాస్త్ర సన్నిధానం మూసివేసిన నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 27) అపాచ్చీమేడు నుంచి సన్నిధానం వరకు వివిధ ప్రభుత్వ శాఖలు , స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పరిశుభ్రత పనులు నిర్వహించారు.*
*ఏకకాలంలో 18 సెక్టార్లలో క్లీనింగ్ పనులు జరిగాయని , అపాచ్చీమేడు నుంచి సన్నిధానం వరకు వివిధ బృందాలను నియమించినట్లు డ్యూటీ అధికారి k. కృష్ణకుమార్ తెలిపారు.*
*అరవణ స్తావరాన్ని మరియు దాని పరిసరాలు , మాలికాపురం అమ్మవారి ఆలయం వెనుక ప్రాంతం , ఆయుర్వేద ఆసుపత్రి మరియు దాని పరిసరాలు శుభ్రపరిచే కార్యక్రమాలలో అధిక ప్రాధాన్యత ఇవ్వబడ్డాయి.*
*ఈరోజు ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన స్వచ్ఛ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు , విశుద్ధి సేన , వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులు తదితరులు చురుకుగా పాల్గొన్నారు.*
*డ్యూటీ అధికారి K.కృష్ణకుమార్ మాట్లాడుతూ అన్ని శాఖలు , స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా పరిశుభ్రత పనులను సమర్ధవంతంగా చేపడుతున్నాయన్నారు.*