శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, విజయవాడ :
వైజాగ్ కు చెందిన దాత డి వెంకట రెడ్డి మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారి అలంకరణ నిమిత్తం 47.5 గ్రాములు బరువు కలిగిన బంగారు నాన్ త్రాడు, సూత్రాలు(2 నెం. లు), నాన్ కోడ్ – 1 నెం. ను ఆలయ అధికారులను కలిసి విరాళముగా అందజేశారు.
ఈ సందర్బంగా ఆలయ అధికారులు దాత కుటుంబం నకు అమ్మవారి దర్శనం కల్పించి, వేదపండితులుచే వీరికి వేదార్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం మరియు చిత్రపటం అందజేశారు.