టీటీడీ లేఖలకు స్పెషల్ ఆఫీసర్ నియమించిన తెలంగాణ సర్కార్
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకునేందుకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సిఫారసు లేఖల వ్యవహారాలను చూసుకునేందుకు ఓఎస్డిని నియమించింది. సి.గణేశ్ కుమార్ సేవలను వినియోగించుకునేందుకు
తాజాగా ప్రభుత్వం అనుమతి జారీ చేసింది. రెండేళ్ల పాటు కాంట్రాక్టు పద్ధతిలో ఆయన సేవలను వినియోగించు కునేందుకు అనుమతి ఇస్తూ గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశాలు జారీ చేశారు.