విజయవాడతేదీ:28.05.2025 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు వారి ఆత్మ గౌరవం నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను ప్రభుత్వ౦ అధికారికంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయంలో జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భం గా కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.క్రిష్ణయ్య మాట్లాడుతూ … ’నందమూరి తారక రామారావు పేరే ఓ సంచలనO అనీ, తెలుగు సినిమా చరిత్రలో ప్రభంజనం సృష్టించి రాజకీయాల్లో అడిగి పెట్టి గొప్ప సంస్కరణలకు తెర తీశారని కొనియాడారు. అలానే “ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయనతో కలిసి పని చేశా. మా ఇద్దరి అనుబంధం ఎంతో ప్రత్యేకమైంది. నేను గుడివాడ ఆర్డీఓగా వున్నా. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు రెటర్నింగ్ అధికారిని అయిన నా దగ్గర నా నామినేషన్ సమర్పించారు. గెలిచిన తరవాత ధ్రువీకరణ పత్రాన్ని అందజేశాను. రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు గుంటూరు జాయింట్ కలెక్టర్ గా వున్న నన్ను ఆయన కార్యాలయంలో సమ్యుక్త కార్యదర్శిగా తీసుకున్నారు. పరిపాలనలో ఓ యముడిని అనేవారు. అవినీతిని అసలు సహించేవారు కాదు. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఎందరో జీవితాలను మార్చింది. కరణం వ్యవస్థను రద్దు చేయడంతోపాటు మండల వ్యవస్థను పరిచయం చేశారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్ళిన ఘనత ఆయనకే దక్కుతుంది. సన్నబియ్యం అందించి పేదలు రెండు పూటలా అన్నం తినేలా చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్ళను అందుబాటులోకి తేవడంతో ప్రతిభావంతులైన పేదలకి విద్యా ఫలాలు దక్కాయి. ఆ తరవాతా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. తెలుగు గంగ పథకంతో రాయల సీమ ప్రజల దాహర్థి ని తీర్చడమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల్లోను నీటి కొరతను తీర్చారు. ఇలాంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. తెలుగు వారిపైన పడిన మదరాశీలు అనే ముద్రను తొలగించారు. ఆంధ్రా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఆ మహనీయుడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే” అంటూ ఎన్ టీఆర్ తో కలిసి పని చేసిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఏపీపిసిబి సభ్య కార్యదర్శి, చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ , జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ , సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, ఏపీపిసిబి సీనియర్ అధికారులు, సిబ్బందీ తదితరులు పాల్గొన్నారు.
