విద్యాధరపురంలోని షాదీఖానా, బరియల్ గ్రౌండ్ పరిశీలన
*అభివృద్ధి చేసేందుకు పరిశీలన*
– *అబ్దుల్ అజీజ్, వక్ఫ్ బోర్డు చైర్మన్*
విజయవాడ నగరంలోని విద్యాధరపురంలో గల షాది ఖానా, బరియల్ గ్రౌండ్ ను ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, వక్ఫ్ బోర్డ్ సీఈవో అబ్దుల్ ఖాదిర్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మాట్లాతూ విద్యాధరా ప్రాంతంలో గల ఈ ప్రాంతాన్ని అభివృధి చేసేందుకు గల సాధ్య, అసాధ్యాల ను పరిశీలించా మన్నారు. విద్యాధరపురంలోని NTS No. 128 లో గల 6.90 ఎకరాల, 3.00 సెంట్స్ లో గల భూమిని ముస్లిమ్స్ స్మశాన వాటిక కు కేటాయించి ఉందన్నారు.. మిగతా భూమి 3 ఎకరాల 90 సెంట్స్ భూమి ని అభివృధి కోసం వినియోగించాలని గెజిట్లో నమోదు చేయబడిందన్నారు.. ఈ స్థలాన్ని అభివృధి పరిచే విషయంలో తగు నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.