జై బాపూజీ,జై భీం,జై సంవిధాన్ పోస్టర్ ను ఆవిష్కరించిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
*అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి*
*రాజీనామా చేయకుంటే ప్రధాని మోడీ అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి*
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
– పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ గురించి హేళన గా మాట్లాడారు
– అంబేద్కర్ పేరును ఫ్యాషన్ అంటూ అవమానించారు
– సభలో అంబేద్కర్ పేరు చెప్పగానే బీజేపీ ఎంపీలు నవ్వుతున్నారు
– అంబేద్కర్ జపం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది
– భారత రాజ్యాంగం రాసింది అంబేద్కర్
– ఆయన రాసిన రాజ్యాంగం ఇవ్వాల్టికి మనకు శాసనం
– మనకు ప్రజాస్వామ్యం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం
– మన ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు
– సమానంగా,స్వేచ్చగా, సగౌరవంగా బ్రతుకుతున్నారు అంటే రాజ్యాంగం కల్పించిందే
– మేము ఎప్పుడు అంబేద్కర్ జపం చేస్తాం
– మీరు జపం చేయడానికి వచ్చిన కష్టం ఏంటి ?
– అంబేద్కర్ అంటే బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు నింపారు
– అంటరాని తనం నిర్మూలన పై అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు
– బీజేపీ హేళన విధానాలను దేశం గమనిస్తుంది
– బీజేపీ రాజ్యాంగాన్ని హేళన చేస్తుంటే రాష్ట్ర ఎంపిలు మౌనం గా ఉన్నారు
– టీడీపీ,వైసిపి,జన సేన ఎంపిలు మౌనం వహించారు
– ఏపిలో దళిత బిడ్డలను అవమానించారు
– ఏపి ప్రజలను మోడీ వెన్నుపోటు పొడిచారు
– హోదా ఇస్తామని మోసం చేశారు
– అలాంటి మోడీ నీ పట్టుకొని అధికార, ప్రతిపక్షాలు ఆయన జపం చేస్తున్నారు
– మొన్న మోడీ విశాఖ వచ్చారు
– కనీసం విభజన హామీలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు
– విశాఖ స్టీల్ మీద ఎటువంటి ప్రకటన లేదు
– ప్రైవేటీకరణ మీద వైఖరి ఏంటో చెప్పలేదు
– మోడీ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మోసం చేశారు
– మోసం చేసిన మోడీతో చంద్రబాబు సక్రమ సంబంధం… వైసిపి ది అక్రమ సంబంధం
– ఈ దేశ సంపదను అదానీ కి మోడీ కట్టబెడుతున్నారు
– దోచుకోవడం దాచుకోవడం మోడీ సిద్ధాంతం
– ఈ రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే
– ఈ రాష్ట్రంలో షర్మిలా రెడ్డి మాత్రమే పోరాటం చేస్తుంది
– మన దేశాన్ని రక్షించుకోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం
– కాంగ్రెస్ తోనే దేశాభివృద్ధి
– బీజేపీ అధికారంలో అంటే దేశాన్ని అమ్మేస్తారు.
– అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి
– ఆయన రాజీనామా చేయకుంటే మోడీ వెంటనే అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి
*మణిక్కం ఠాగూర్*
Aicc రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి
– పార్లమెంట్ వేదికగా అంబేద్కర్ ను బీజేపీ అవమానించింది
– నిండు సభలో అంబేద్కర్ కి అవమానం జరిగితే వైసిపి, టీడీపీ,జనసేనా ఎంపీలు మౌనం వహించారు
– బీజేపీ కి రాజ్యాంగం అంటే గౌరవం లేదు
– బీజేపీ విధానాలను ఎండగడతం