Home Political news వక్ఫ్ బోర్డ్ డిజిటలైజేషన్ పై ఏపీ ఆన్లైన్ వారితో అబ్దుల్ అజీజ్ సమావేశం.

వక్ఫ్ బోర్డ్ డిజిటలైజేషన్ పై ఏపీ ఆన్లైన్ వారితో అబ్దుల్ అజీజ్ సమావేశం.

3
0

 విజయవాడ, 16 – 01 – 2025

వక్ఫ్ బోర్డ్ డిజిటలైజేషన్ పై ఏపీ ఆన్లైన్ వారితో అబ్దుల్ అజీజ్ సమావేశం.

గత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిన దాన్ని తిరిగి పునః ప్రారంభిస్తాం.

– షేక్. అబ్దుల్ అజీజ్, ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్.

టీడీపీ హయాంలో చేపట్టిన వక్ఫ్ బోర్డ్ డిజిటలైజేషన్ కు గత వైసిపి ప్రభుత్వం మెయింటెనెన్స్ నిధులు విడుదల చేయక అర్ధాంతరంగా ఆగిపోయింది. దానిని పునఃప్రారంభించేందుకు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఏపీ ఆన్లైన్ వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో గతంలో డెవలప్ చేసిన అసెట్, లీగల్, లీజు, రెంట్, ఈ టెండరింగ్, గవర్నమెంట్ స్కీమ్స్ మాడ్యూల్స్ గురించి వివరంగా చర్చించి వాటిని మరింత అభివృద్ధి చేసి జిఐఎస్/ జిపిఎస్ మ్యాపింగ్ చేసి వక్ఫ్ ప్రాపర్టీస్ కి జియో ఫెన్సింగ్ చేసే విధంగా డెవలప్ చేయాలని సూచించారు. పాత బకాయిలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో చర్చించి మళ్లీ వీటిని వాడుకలోకి తెస్తామని తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో ఏపీ ఆన్లైన్ నుంచి రాజా, రమేష్, గోపీనాథ్, నూర్ అహ్మద్, వక్ఫ్ బోర్డ్ నుంచి సీఈవో అబ్దుల్ ఖాదిర్, పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here