Home Andhra Pradesh దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎంగా ఎన్.రమేష్ బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎంగా ఎన్.రమేష్ బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

2
0

 దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎంగా ఎన్.రమేష్ బాధ్య‌త‌లు స్వీక‌ర‌ణ‌

విజ‌య‌వాడ‌:-  ట్రాక్ కిలోమీటర్లు, రైళ్ల కార్యకలాపాల నిర్వహణ మరియు ఆదాయాపరంగా భారతదేశంలోని అతిపెద్ద రైల్వే జోన్లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వేకు ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్(పి.సి.సి.ఏం)గా ఎన్.రమేష్ సికింద్రాబాద్‌లోని రైలు నిలయంలో బుధ‌వారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ర‌మేష్ ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1992 బ్యాచ్‌కి చెందినవారు కాగా… బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ మరియు లా (బి.ఎస్సీ,బి.ఏ.,ఎల్.ఎల్.బి) లలో పట్టభద్రులు. ప్రస్తుత నియామకానికి ముందు ఆయ‌న నైరుతి రైల్వేలో చీఫ్ క్లెయిమ్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. 30 సంవత్సరాల తన కెరీర్‌లో, భారతీయ రైల్వేలలో బెంగళూరు డివిజన్‌లో సీనియర్ డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ మరియు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్, న్యూఢిల్లీలోని రైల్వే మంత్రికి డైరెక్టర్/పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/కో-ఆర్డినేషన్, నైరుతి రైల్వేలో చీఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ మేనేజర్ మరియు చీఫ్ క్లెయిమ్స్ ఆఫీసర్ వంటి అనేక కీలక పదవులను నిర్వహించారు. ఆయన భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీగా ఎంపానెల్ చేయబడ్డారు. 2014-2019 సంవత్సరంలో రైల్వే మంత్రి వద్ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/సమన్వయ అధికారిగా పనిచేస్తున్నప్పుడు వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన రైల్వే ప్రాజెక్టులను చేపట్టడానికి భారత రైల్వేలతో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి ఆయన అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here