యువగళం పాదయాత్రతో నారా లోకేష్ ప్రజాసమస్యలను తెలుసుకున్నారు
.
ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి కృషి చేస్తున్నారు.
మైలవరం శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు.
పాల్గొన్న శాసనసభ్యులు కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 23.01.2025.
యువగళం పాదయాత్రతో ప్రజాసమస్యలను తెలుసుకుని, వారి సమస్యల పరిష్కారంతో పాటు, మానవ వనరులను అభివృద్ధి చేస్తూ, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి మంత్రివర్యులు నారా లోకేష్ కృషి చేస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
మైలవరంలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా కేకును కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ప్రథమ నాయకుడు నారా లోకేష్ అని కొనియాడారు. లోకేష్ భరోసాతో టీడీపీ సభ్యత్వాలను కోటికి పైగా తీసుకున్నారని అన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. తాజాగా విదేశీ పర్యటనలో భారీగా పెట్టుబడులను ఏపీకి తీసుకురావటానికి కృషి చేస్తున్నారన్నారు. అలానే ఐటీ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏపీకి మంచిరోజులు వచ్చాయన్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.