విజయవాడ తేది:24.01.2025
ప్రజల ఆరోగ్య సంరక్షనే ప్రభుత్వ ప్రాధాన లక్ష్యం.
హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మరిని సమూలంగా రూపుమాపుద్దాం.
హెచ్ఐవి వ్యాధిగ్రస్థులలో మనోధైర్యన్ని నింపాలి
వ్యాధి లక్షణాలున్న వారికి వైద్య పరీక్షలకు మొబైల్ వాహనం.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
ప్రజల ఆరోగ్య సంరక్షనే ప్రభుత్వ ప్రాధాన లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు పరీక్షలు నిర్వహించి పూర్తి వైద్య సహాయం అందించేందుకు రూ.3.60 కోట్ల ఖర్చుతో 10 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్ట్ంగ్ సెంటల్ (ఐసిటిసి) వ్యాన్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఏపి స్టేట్ ఎయిడ్స్ కౌంట్రోల్ సోసైటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్ట్ంగ్ సెంటల్ (ఐసిటిసి) మొబైల్ వాహనాలను శుక్రవారం వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సిద్ధార్థా మెడికల్ కళాశాల ప్రాంగణం నుండి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య పరిరక్షణనే లక్ష్యంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిని సమూలంగా రూపుమాపేందుకు ప్రభుత్వం కృత నిచ్చయంతో చర్యలు తీసుకుంటుందన్నారు. హెచ్ఐవి వ్యాధి లక్షణాలు ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి పూర్తి వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి 3.60 కోట్ల రూపాయల ఖర్చుతో 10 ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్ట్ంగ్ సెంటల్ (ఐసిటిసి) మొబైల్ వాహనాలను అందుబాటులోకి తీసురావడం జరిగిందన్నారు. మొబైల్ వ్యాన్లో వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలతో పాటు ల్యాబ్ టెక్నిషన్ సిబ్బందిని నియమించడం జరిగిందని మొబైల్ వాహనాలు నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 25 లక్షల హెచ్ఐవి కేసులు నమోదయ్యాయన్నారు. కేవలం మన రాష్ట్రంలో 2.22 లక్షల మంది వ్యాధి బారిన పడిన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. 1998లో మన రాష్ట్రంలో 2.42 శాతంగా ఉన్న హెచ్ఐవి వ్యాధి సంఖ్య ప్రభుత్వ తీసుకున్న చర్యల కారణంగా 0.62 కు తగ్గించగలిగామన్నారు. అయిన్నప్పటికి పూర్తి స్థాయిలో వ్యాధిని నివారించి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. హెచ్ఐవి వ్యాధి సోకిన వారిని మానవత దృక్బదం తో ఆదరించి వారికి మనోధైర్యం కల్పిస్తే జీవన ప్రామాణాలను పెంచిన వారమవుతామన్నారు. వ్యాధి లక్షణాలు కలిగిన వారు అనూన్యత భావనాన్ని విడనాడి ధైర్యంగా వైద్య పరీక్షలు నిర్వహించుకుని చికిత్స పొందన్నారు. 6 నెలల పాటు హెచ్ఐవి వైద్య చికిత్సలు పొందిన వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల 4 వేల రూపాయలు పెన్షన్ అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో 42 వేల మంది పెన్షన్ సౌకర్యం పొందుతున్నారన్నారు. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికి వైద్య ఆరోగ్య రంగానికి ఆర్థిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. టిబి, హెచ్ఐవి, కాన్సర్, కుష్ఠువ్యాధి, డయాబెటిస్ వంటి సంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారన్నారు. ఏటా 70 వేల మంది కన్సర్ బారిన పడగా 40 వేల మంది చనిపోతున్నారని దీనికి కారణం అవగాహన లోపమే అన్నారు. 6 నెలల నుండి 18 సంవత్సరాల వయస్సు కలిగిన వారికి ప్రభుత్వం 40 రకాల వైద్య పరీక్షలను నిర్వహించి వారి ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుందన్నారు. ప్రజల ముందుకే తీసుకువచ్చిన వైద్య పరీక్షల వాహనాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ప్రజల జీవనశైలిలో మార్పులు రావాల్సి ఉందన్నారు. స్వచ్చంద సంస్థల సహాకారం ప్రజల భాగస్వామ్యంతో మెరుగైన సమాజం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి. కృష్ణబాబు, ఏపిఎస్ఎసిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ డా. ఎ. సిరి, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, ఏపిఎస్ఎసిఎస్ అడిషనల్ డైరెక్టర్ డా. సర్వసతి, జాయింట్ డైరెక్టర్లు డా. కామేశ్వర ప్రసాద్, డా. మంజూల, డా. భాగ్యలక్ష్మి, డా. శీరిష, డియంఅండ్హెచ్వో యం. సుహాసిని, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ డా.జె.ఉషారాణి, సిద్దార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. అశోక్ కుమార్, జిజిహెచ్ సుపరింటెండెంట్ జి. వెంకటేశ్వరరావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డిఎస్విఎల్ నరసింహాం, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కె. పద్మవతి, పలువురు వైద్యాధికారులు, వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.