ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ.25.01.2025
గణతంత్ర దినోత్సవం సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన పోలీసులు కమీషనర్ ఎస్. వి. రాజ శేఖర బాబు ఐ. పి ఎస్.
రేపు ది.26.01.2025 తేదిన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగబోవు గణతంత్ర దినోత్సవ వేడుకల పురస్కరించుకొని ఈ రోజు ది.25.01.2025 తేదిన *పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్* ఇతర పోలీస్ అధికారులతో కలిసి స్టేడియంలో జరుగబోవు గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా స్టేడియం మరియు స్టేడియం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కట్టు దిట్టమైన భద్రత, పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి భద్రతా పరంగా ఎటువంటి చిన్న లోపాలు లేకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని తగిన భద్రత చర్యలు చేపట్టాలని అధికారులుకు ఆదేశాలు జారి చేసారు. అనంతరం స్టేడియం పరిసర ప్రాంతలైన వాటర్ ట్యాంక్ రోడ్డు, బందర్ రోడ్డు, మీ సేవా రోడ్డు లను పరిశీలించి ట్రాఫిక్ పరంగా సామాన్య ప్రజలు ఎక్కడా ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., ట్రాఫిక్ ఏ.డి.సి.పి. ఎ. వి. ఎల్ ప్రసన్న కుమార్ ,ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, ఎస్. ఐ. లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.