Home Andhra Pradesh ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత...

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర కీలకం. జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ, సిపి ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు

2
0

 విజయవాడ తేది: 25.01.2025*

       ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది

    ప్రజాస్వామ్య పరిరక్షణలో యువత పాత్ర కీలకం

    యువత ఓటు హక్కును నమోదు చేసుకోవాలి

     జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ, సిపి ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు.

 ప్రజాస్వామ్య పురోగమణానికి ఓటు పునాది వంటిదని ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజా స్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యులు కావాలని యువత తప్పనిసరిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ, నగర పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు కోరారు.

 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి నుండి ప్రారంభమైన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీశ, సిపి ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు ప్రారంభించారు. 

  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు హక్కు అమ్యులమైనదని ప్రజాస్వామ్య సామాజంలో పౌరుడికి ఉన్న అత్యంత శక్తివంతమైన అహింసా సాదనం ఓటు హక్కు అన్నారు. స్వాతంత్రం వచ్చినప్పుటి నుండి మన రాజ్యాంగం పౌరులందరికి సమాన ఓటు హక్కును కల్పించిందన్నారు. అర్హత, మతం, కులం, జాతి వంటి వివక్షతలకు తావులేకుండా పొందిన ఓటు హక్కును పవిత్ర హక్కుగా పరిగణించాలన్నారు. ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యం కోసం దేశంలోని యువత అత్యంత చిత్త శుద్దితో ఓటు హక్కును వినియోగించుకుని ఇతరలకు స్పూర్తిగా నిలవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎటువంటి ప్రభావం లేకుండా దేశాన్ని ప్రపంచ దేశాలలో శక్తివంతమైన దేశంగా నిలబెట్టడంలో ఎన్నికల వ్యవస్థ కీలక పాత్ర వహిస్తుందన్నారు. 1950వ సంవత్సరంలో ఏర్పాటైన భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపక రోజైన జనవరి 25వ తేది జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం అనందదాయకమన్నారు. పౌరులను చైతన్యవంతులను చేసి ఓటర్లుగా నమోదు చేసే లక్ష్యంతో ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టడం జరిగిందన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత తమ పేరులను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవడం ద్వారా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో భాగస్వామ్యులు కావాలన్నారు. యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి ఓటు హక్కును పొందలని కలెక్టర్‌ లక్ష్మీశ సూచించారు.  

 నగర పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటర్లగా నమోదై ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై స్థిరమైన విశ్వాసం కలిగి స్వచ్ఛ న్యాయమైన శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలన్నారు. ఎన్నికలలో జాతి కుల మతాలకు తావులేకుండా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓటర్లగా పేర్లను నమోదు చేసేకునేలా ప్రజలలో అవగాహన కల్పించేందుకు యువత కృషి చేయాలని నగర పోలీస్‌ కమీషనర్‌ ఎస్‌.వి. రాజశేఖర్‌బాబు కోరారు.  

 కార్యక్రమంలో విజయవాడ ఆర్‌డివో చైతన్య, ఎన్‌ఎస్‌ఎస్‌ స్టేట్‌ కో`ఆర్డినేటర్‌ చంద్రమౌళి, జిల్లా కో`ఆర్డినేటర్‌ కె. రమేష్‌, ప్రోగ్రాం కో`ఆర్డినేటర్‌ బి. యుగ్రంధర్‌, పోర్మం ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ జిల్లా కో`ఆర్డినేటర్‌ అరవ రమేష్‌ వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్లకార్డు ప్రదర్శించి ర్యాలీలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here